Share News

TS News: మా భూముల కబ్జాకు ఎమ్మెల్యే దానం యత్నం.. ప్రకాష్‌నగర్ బస్తీవాసుల ఆందోళన

ABN , Publish Date - Jan 02 , 2024 | 01:26 PM

Telangana: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా ప్రకాష్ నగర్ బస్తివాసుల ఆందోళనకు దిగారు. మంగళవారం ప్రజాభవన్ ముందు ప్రకాష్ నగర్ బస్తివాసులు ఆందోళన నిర్వహించారు. తన అనుచరుడు సుధీర్ గౌడ్ పేరుతో దానం నాగేందర్ తమ భూములను కబ్జా చేస్తున్నారంటూ బస్తీవాసులు ఆరోపించారు.

TS News: మా భూముల కబ్జాకు ఎమ్మెల్యే దానం యత్నం.. ప్రకాష్‌నగర్ బస్తీవాసుల ఆందోళన

హైదరాబాద్, జనవరి 2: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు (MLA Danam Nagender) వ్యతిరేకంగా ప్రకాష్ నగర్ బస్తీవాసులు ఆందోళనకు దిగారు. మంగళవారం ప్రజాభవన్ ముందు ప్రకాష్ నగర్ బస్తీవాసులు ఆందోళన నిర్వహించారు. తన అనుచరుడు సుధీర్ గౌడ్ పేరుతో దానం నాగేందర్ తమ భూములను కబ్జా చేస్తున్నారంటూ బస్తీవాసులు ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి (YSR) హయాంలో తమకు కేటాయించిన స్థలాలను ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారంటూ నిరసనకు దిగారు. ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వటానికి వెళితే దానం అనుచరులు బెదిరిస్తున్నారు అంటూ ఆరోపించారు.

ప్రజాభవన్ ముందు కూడా తమను బెదిరించాలంటూ బేగంపేట్ పోలీస్ స్టేషన్‌లో బస్తీవాసులు ఫిర్యాదు చేశారు. దానం నాగేందర్, అతని అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బాధితులు కోరారు. రౌడీ మూకలు అర్ధరాత్రి పూట వచ్చి బస్తీ వాసులను భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. ఈ మేరకు బేగంపేట్ పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.

Updated Date - Jan 02 , 2024 | 01:26 PM