Share News

Ramoji Rao: తెలుగు మీడియాకు ఎనలేని సేవలు

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:13 PM

మీడియా దిగ్గజం రామోజీరావు మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రామోజీ రావు మృతి వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. తెలుగు మీడియా రంగానికి రామోజీ రావు ఎనలేని సేవలు అందించారని గుర్తుచేశారు.

Ramoji Rao: తెలుగు మీడియాకు ఎనలేని సేవలు
Ramoji Rao

హైదరాబాద్: మీడియా దిగ్గజం రామోజీరావు (Ramoji Rao) మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రామోజీ రావు మృతి వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. తెలుగు మీడియా రంగానికి రామోజీ రావు ఎనలేని సేవలు అందించారని గుర్తుచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ప్రకటించారు. రామోజీ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


రామోజీరావు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సినీ పరిశ్రమ బాగుకోసం రామోజీ రావు తపించారు. రామోజీ మృతిపై పలువురు సంతాపం ప్రకటించారు. రామోజీ మృతికి గౌరవసూచకంగా ఆదివారం తెలుగు చిత్ర పరిశ్రమ బంద్‌కు చలనచిత్ర నిర్మాతల మండలి పిలుపునిచ్చింది.

Updated Date - Jun 08 , 2024 | 12:13 PM