Share News

TS News: యువకుడిపై కత్తులతో దాడి..

ABN , Publish Date - Mar 12 , 2024 | 08:52 AM

రాజేంద్రనగర్‌లో కత్తి పోట్ల కలకలం రేపుతోంది. తెల్లవారుజామున నితీష్ అనే యువకుడిపై కత్తులతో దాడి చేశారు. విచక్షణా రహితంగా నితీష్‌పై దుండగులు కత్తితో దాడి చేశారు.

TS News: యువకుడిపై కత్తులతో దాడి..

రంగారెడ్డి: రాజేంద్రనగర్‌ (Rajendranagar)లో కత్తి పోట్ల కలకలం రేపుతోంది. తెల్లవారుజామున నితీష్ అనే యువకుడిపై కత్తులతో దాడి చేశారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఎన్ఎమ్ గూడ చౌరస్తాలో ఘటన చోటు చేసుకుంది. కత్తి పోట్లకు గురైన నితీష్‌ను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital)కి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. కత్తిపోట్లకు గురైన వ్యక్తి స్టార్ హోటల్‌ (Star Hotel)లో వెయిటర్‌గా పని చేస్తున్నట్లు గుర్తించారు. అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ (CC TV) ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

Hyderabad: నేడు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచన

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 12 , 2024 | 08:52 AM