Share News

TS NEWS: కాంగ్రెస్ హామీలపై ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 03 , 2024 | 07:58 PM

తెలంగాణలో బీఆర్ఎస్(BRS) అంతరించిపోయే పార్టీ అని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్(Eatala Rajendar) అన్నారు. రాజకీయ భవిష్యత్ ఉండాలంటే బీజేపీతోనే ఉండాలని నేతలు భావిస్తున్నారని తెలిపారు.

TS NEWS: కాంగ్రెస్ హామీలపై ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్(BRS) అంతరించిపోయే పార్టీ అని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్(Eatala Rajendar) అన్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ భవిష్యత్ ఉండాలంటే బీజేపీతోనే ఉండాలని నేతలు భావిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ఇకపై ఉండేది.. బీజేపీ, కాంగ్రెస్ మాత్రమేనని చెప్పారు. కాంగ్రెస్ పాలన గురించి.. ఇచ్చిన హామీల గురించి ఇప్పుడే మాట్లాడనని చెప్పారు. కానీ గతంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన అనుభవంతో తనకు తెలిసి... వీటిని అమలు చేయడం కష్టమని తెలిపారు. భవిష్యత్తు బీజేపీదేనని.. అసెంబ్లీ ఎన్నికల్లో 15శాతం ఓట్లతో పునాదులు వేసుకున్నామని తెలిపారు. ఇకపై తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండా మాత్రమేనని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - Feb 03 , 2024 | 07:59 PM