Shabbir Ali: ‘కేటీఆర్.. ముందు మీ అయ్యతో ఆ మాట చెప్పించు’
ABN , Publish Date - Jan 30 , 2024 | 04:30 PM
Telangana: మాజీ మంత్రి కేటీఆర్ మైనార్టీలపై దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారని ప్రభుత్వ సలహాదార షబ్బీర్ అలీ దుయ్యబట్టారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మీరు అధికారంలో వున్నప్పుడు మైనార్టీలకు ఏం చేశారు? కామారెడ్డికి వచ్చి మీ అయ్య ఎందుకు పోటీ చేసిండు? ఒక్క అమాయకుణ్ణి ఓడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిండ్రు’’ అంటూ విరుచుకుపడ్డారు.
హైదరాబాద్, జనవరి 30: మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) మైనార్టీలపై దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government Adviser Shabbir Ali) దుయ్యబట్టారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మీరు అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు ఏం చేశారు? కామారెడ్డికి వచ్చి మీ అయ్య ఎందుకు పోటీ చేసిండు? ఒక్క అమాయకుణ్ణి ఓడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిండ్రు’’ అంటూ విరుచుకుపడ్డారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు చేసిందేమి లేదన్నారు. తనకు కాంగ్రెస్ సర్కార్ సలహాదారులుగా నియమించిందన్నారు.
ఎన్నికల్లో నిలబడ్డ మైనార్టీ నేతలు ఓడిపోయారని.. ఏం చేద్దాం మరి అని ప్రశ్నించారు. మైనార్టీలకు కాంగ్రెస్ అవకాశాలు ఇస్తుందన్నారు. ఇప్పటి వరకు వేసిన టీఎస్పీఎస్సీలో కావచ్చు, సుప్రీం కోర్టులో ఏజీగా మైనార్టీకి అవకాశం ఇచ్చిందన్నారు. రానున్న రోజుల్లో కూడా మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తదని స్పష్టం చేశారు. ‘‘ముందు మీ అయ్యతో కామారెడ్డికి వచ్చి ఎందుకు పోటీ చేశాడో చెప్పించు’’ అంటూ కేటీఆర్పై షబ్బీర్ అలీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...