Share News

TS NEWS: మేడిగడ్డ అంశంలో ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక

ABN , Publish Date - Jan 22 , 2024 | 09:40 PM

మేడిగడ్డ అంశంలో ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ఇచ్చింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు విజిలెన్స్ తేల్చింది.

TS NEWS: మేడిగడ్డ అంశంలో ప్రభుత్వానికి  విజిలెన్స్ నివేదిక

హైదరాబాద్: మేడిగడ్డ అంశంలో ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ఇచ్చింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు విజిలెన్స్ తేల్చింది. 3,200 కోట్ల ప్రజాధనం నిర్మాణం పేరుతో వృథా చేశారని స్పష్టం చేసింది. మధ్యంతర నివేదికను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిద్ధం చేసింది. వారం రోజుల్లో ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇస్తున్నట్లు తెలిపింది. నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు దోషులేనని తేల్చిచెప్పింది.వరద ఉద్ధృతి అంచనా లేకుండానే డిజైన్ చేశారని పేర్కొంది. బ్యారేజ్‌ కుంగడం అకస్మాత్తుగా జరిగింది కాదని విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికలో స్పష్టం చేసింది.

Updated Date - Jan 22 , 2024 | 09:40 PM