Share News

Hyderabad: నగరంలో గంజాయి బ్యాచ్ హల్‌చల్.. ఏడుగురిపై దాడి..!

ABN , Publish Date - May 29 , 2024 | 08:21 AM

హైదరాబాద్ ఉప్పల్‌లో గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేసింది. క్రికెట్ ఆటలో జరిగిన ఓ గొడవ నేపథ్యంలో రాడ్లు, కర్రలతో యువకులపై దాడులకు తెగబడ్డారు. బీఆర్ఎస్ నేతతో సహా ఏడుగురిపై దాడి చేయడంతో వారంతా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.

Hyderabad: నగరంలో గంజాయి బ్యాచ్ హల్‌చల్.. ఏడుగురిపై దాడి..!

హైదరాబాద్: ఉప్పల్‌లో గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేసింది. క్రికెట్ ఆటలో జరిగిన ఓ గొడవ నేపథ్యంలో రాడ్లు, కర్రలతో యువకులపై దాడులకు తెగబడ్డారు. బీఆర్ఎస్ నేతతో సహా ఏడుగురిపై దాడి చేయడంతో వారంతా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.


అసలేం జరిగిందంటే..?

ఉప్పల్ శాంతినగర్‌లో యువకులు క్రికెట్ ఆడుతుండగా గొడవ జరిగింది. దీంతో అక్కడే ఉన్న గంజాయి బ్యాచ్ యువకుడిపై బ్యాట్‌తో దాడి చేయగా తీవ్రగాయాలు అయ్యాయి. దీనిపై అడిగేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకుడు ఈగ సంతోశ్‌తోపాటు మరో ఏడుగురిపైనా రాడ్లు, కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని తరిమికొట్టారు. బాధితులను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించడంతో చికిత్సపొందుతున్నారు. నగరంలో గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోయిందని, యువత మత్తుకు బానిసై నేరాలకు పాల్పతున్నారని స్థానికులు అంటున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా మత్తుపదార్థాల నియంత్రణలో విఫలమవుతున్నారంటూ పలువురు పెదవి విరుస్తున్నారు.

For more latest Telangana news and Telugu news..

Updated Date - May 29 , 2024 | 08:21 AM