Share News

Narendra Modi: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి మోదీ

ABN , Publish Date - Aug 10 , 2024 | 04:05 AM

ఎస్సీ వర్గీకరణ అంశంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రమేనని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.

Narendra Modi: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి మోదీ

  • ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ

  • ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ

న్యూఢిల్లీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ అంశంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రమేనని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను మందకృష్ణ మాదిగ శుక్రవారం రాత్రి న్యూఢిల్లీలో కలిశారు. దాదాపు 30 నిమిషాలు ప్రధానితో భేటీ అయిన మందకృష్ణ ఎస్సీ వర్గీకరణకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.


అలాగే, మంద కృష్ణను ఆప్యాయంగా పలకరించి హత్తుకున్న ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ త్వరితగతిన అమలు అయ్యేలా చూడాలని కోరారు. వర్గీకరణ అంశంపై కొందరు సుప్రీం కోర్టు వెళ్లే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని అన్నారు.

Updated Date - Aug 10 , 2024 | 04:05 AM