Share News

Karimnagar: పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఆత్మహత్య

ABN , Publish Date - Jul 28 , 2024 | 04:49 AM

పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక కరీంనగర్‌ శివారులోని ఓ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కోమళ్ల శిరీష(20) శనివారం ఆత్మహత్య చేసుకుంది.

Karimnagar: పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఆత్మహత్య

కరీంనగర్‌ క్రైం, జూలై 27: పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక కరీంనగర్‌ శివారులోని ఓ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కోమళ్ల శిరీష(20) శనివారం ఆత్మహత్య చేసుకుంది. మరో మూడు రోజుల్లో ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం పరీక్షలున్నాయి. తన వల్ల ఈ చదువుకావడంలేదని శిరీష తల్లిదండ్రులకు చెప్పి తరచూ బాధపడేది. ఈ క్రమంలో శనివారం శిరీష ఇంట్లో ఉరి వేసుకుంది.


తల్లిదండ్రులు కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. శిరీష తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - Jul 28 , 2024 | 04:49 AM