Share News

K. Lakshman: రాజ్యసభలో బీజేపీ విప్‌గా లక్ష్మణ్‌..

ABN , Publish Date - Aug 01 , 2024 | 04:28 AM

రాజ్యసభలో బీజేపీ విప్‌గా ఎంపీ కె.లక్ష్మణ్‌ను నియమిస్తున్నట్లు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

K. Lakshman: రాజ్యసభలో బీజేపీ విప్‌గా లక్ష్మణ్‌..

న్యూఢిల్లీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభలో బీజేపీ విప్‌గా ఎంపీ కె.లక్ష్మణ్‌ను నియమిస్తున్నట్లు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 2022 జూన్‌ 2న ఉత్తరప్రదేశ్‌ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా లక్ష్మణ్‌ నియమితులయ్యారు. విద్యార్థి దశలోనే ఏబీవీపీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన లక్ష్మణ్‌.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగానూ పని చేశారు.


రెండు సార్లు ముషీరాబాద్‌ ఎమ్మెల్యేగా సేవలు అందించారు. ప్రస్తుతం బీజేపీలో అత్యంత కీలకమైన పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. తెలంగాణకే చెందిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి లోక్‌ సభలో బీజేపీ విప్‌గా సోమవారమే నియమితులైన విషయం తెలిసిందే.

Updated Date - Aug 01 , 2024 | 04:28 AM