Share News

Patancheru: ఆరేళ్ల బాలుడి ప్రాణం తీసిన టైరు

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:51 AM

మృత్యువు ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో చెప్పలేం అనడానికి ఈ విషాద ఘటనే సాక్ష్యమేమో! ఏ వాహనం నుంచి ఊడిందో ఏమో ఓ టైరు వేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తున్న ఆరేళ్ల బాలుడిని బలంగా ఢీకొట్టగా..

Patancheru: ఆరేళ్ల బాలుడి ప్రాణం తీసిన టైరు

  • ఔటర్‌పై వాహనం నుంచి ఊడి.. చిన్నారిని ఢీకొన్న టైరు

పటాన్‌చెరు, జూలై 26: మృత్యువు ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో చెప్పలేం అనడానికి ఈ విషాద ఘటనే సాక్ష్యమేమో! ఏ వాహనం నుంచి ఊడిందో ఏమో ఓ టైరు వేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తున్న ఆరేళ్ల బాలుడిని బలంగా ఢీకొట్టగా.. చికిత్స పొందుతూ చిన్నారి మృతిచెందాడు. సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్‌పూర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమీన్‌పూర్‌ మండలం పటేల్‌గూడా గ్రామం హరివిల్లు కాలనీకి చెందిన సందీ్‌పరెడ్డి.. ఈనెల 21న కుటుంబసభ్యులతో కలిసి ముత్తంగిలోని ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసేందుకు కారులో బయలుదేరాడు.


సుల్తాన్‌పూర్‌ వద్ద ఓఆర్‌ఆర్‌పైకి వాహనం వెళ్లాక మూత్రం వస్తోందని ఆయన కుమారుడు మోక్షిత్‌ (6) చెప్పడంతో కారును సందీప్‌ రోడ్డుకు ఓ పక్కన వాహనాన్ని ఆపాడు. చిన్నారి రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తుండగా వెనుక నుంచి వేగంగా ఓ టైరు దూసుకొచ్చి బాలుడికి తగిలింది. ఈ ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స కోసం వెంటనే ముత్తంగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని రెయిన్‌ బో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మోక్షిత్‌ గురువారం మృతిచెందాడు.

Updated Date - Jul 27 , 2024 | 03:51 AM