AP High Court: తమాషాలు చేస్తున్నారా.. ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్..
ABN , Publish Date - Mar 25 , 2025 | 09:38 PM
AP High Court: పోలీసులపై ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు వారి తప్పులను కప్పి పుచ్చుకోడానికి తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని హెచ్చరించింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఉద్దేశించి రాష్ట్ర హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోర్టుకేమీ తెలియదని అనుకోవద్దంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసు మాన్యువల్ పట్టించుకోకుండా... తప్పును కప్పిపుచ్చుకొనేందుకు మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నారని హైకోర్టు మందలించింది. కొందరు పోలీసుల వైఖరితో ఆ వ్యవస్థను నమ్మే పరిస్థితి లేకుండా పోతుందని న్యాయస్థానం మండిపడింది. కర్నూలు మూడో పట్టణ పోలీసుల తీరుపై ధర్మాసనం సీరియస్ అయింది.
ఈ కేసుకు సంబంధించి పూర్తి రికార్డులను తమ ముందు ఉంచాలని సీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణను ఏప్రిల్ 8వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. సామాజిక మాధ్యమాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రేమ్ కుమార్ అనేవ్యక్తి పోస్టులు పెట్టారు. సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ్ కుమార్ కుమారుడు అభినయ్ గత ఏడాది డిసెంబర్లో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారని గుర్తుచేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసుల తీరును న్యాయమూర్తి తప్పపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే
Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్
Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ
Read Latest AP News And Telugu News