Share News

Internet Shut downs: ఇంటర్నెట్ అణిచివేత.. ప్రజాస్వామ్యానికి మంచిదేనా? నివేదికలో విస్తుపోయే వాస్తవాలు!

ABN , Publish Date - Feb 25 , 2025 | 08:28 PM

Internet Shut downs : ఇండియాలో మరోసారి ఇంటర్నెట్ స్వేచ్ఛపై చర్చ మొదలైంది. 2024లో ఇంటర్నెట్ షట్‌డౌన్‌లకు సంబంధించిన డిజిటల్ హక్కుల సంస్థ విడుదల చేసిన నివేదికలో విస్తుపోయే నిజాలు బయటికొచ్చాయి..

Internet Shut downs: ఇంటర్నెట్ అణిచివేత.. ప్రజాస్వామ్యానికి మంచిదేనా? నివేదికలో విస్తుపోయే వాస్తవాలు!
Internet Shutdown Problem in India

Internet Shut downs : ఇండియాలో మరోసారి ఇంటర్నెట్ స్వేచ్ఛపై చర్చ నడుస్తోంది. 2024లో దేశవ్యాప్తంగా 84 ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు విధించినట్టు డిజిటల్ హక్కుల సంస్థ ఆక్సెస్ నౌ తాజా నివేదిక వెల్లడించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో అత్యధికం. అయితే మయన్మార్ మాత్రం 85 షట్‌డౌన్‌లతో భారత్‌ను దాటిపోయింది. ఇండియాలో ఈ షట్‌డౌన్‌లలో 41 నిరసనలకు సంబంధించినవే ఉన్నాయి. అటు 23 కమ్యూనల్ హింస కారణంగా అమలులోకి తెచ్చినవే. అంతేకాకుండా, సర్కారీ ఉద్యోగాల నియామక పరీక్షల సమయంలో 5 షట్‌డౌన్‌లు విధించారు. దేశంలోని 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కనీసం ఒక్కసారి అయినా నెట్‌బంద్ బారినపడ్డాయి. మణిపూర్ (21), హర్యానా (12), జమ్ముకశ్మీర్ (12) లలో అత్యధికంగా ఇంటర్నెట్ నిలిపివేశారు.


నిజానికి భారత ప్రభుత్వం ఇంటర్నెట్ షట్‌డౌన్‌లను నియంత్రించే కొత్త చట్టాలను తీసుకొచ్చింది. 2023 టెలికమ్యూనికేషన్ చట్టం, 2024 టెలికాం సస్పెన్షన్ రూల్స్ పేరుతో ప్రభుత్వం 1885 టెలిగ్రాఫ్ చట్టంలోని కొలొనియల్-ఎరా నిబంధనలను కొనసాగిస్తోంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ అధికారులే ఈ షట్‌డౌన్‌లను అణిచివేసే అధికారం కలిగి ఉండటంతో, ప్రజాస్వామ్య విలువలు మరింత క్షీణిస్తున్నాయని మండిపడ్డాయి.


2024లో ప్రపంచవ్యాప్తంగా 54 దేశాల్లో 296 షట్‌డౌన్‌లు నమోదయ్యాయి. యుద్ధాలు, హింసా సంఘటనలు ప్రధాన కారణాలుగా 103 షట్‌డౌన్‌లు నమోదుకాగా, 74 నిరసనల కారణంగా, 16 పరీక్షల కారణంగా, 12 ఎన్నికల సందర్భంగా అమలుచేయబడ్డాయి.


ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు మానవ హక్కుల ఉల్లంఘనలను కప్పిపుచ్చేందుకు ఇంటర్నెట్‌ సస్పెన్షన్‌ను ఆయుధంగా మారుస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ప్రజల్ని అణచివేసేందుకు, ప్రభుత్వ వైఫల్యాలను దాచిపెట్టేందుకు, సామాజిక మాధ్యమాల్లో చెలరేగే నిరసనలను ఆపేందుకు ఇలాంటి దుష్ట రాజకీయాలు జరుగుతున్నాయన్న వాదన ఉంది.


ఇంటర్నెట్ అణచివేతలను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంస్థలు గళమెత్తుతున్నాయి. #KeepItOn అనే ఉద్యమం 2024లో 25 దేశాల్లో అధిక ప్రమాదంతో ఉన్న ఎన్నికలను పర్యవేక్షిస్తూ, నిరసనలు, పరీక్షల సమయంలో షట్‌డౌన్‌లను నిరోధించేందుకు తీవ్రంగా పోరాడింది. అంతర్జాతీయ స్థాయిలో, ఆఫ్రికా హక్కుల కమిషన్ కూడా ప్రభుత్వాలను ఎన్నికల సమయంలో ఇంటర్నెట్‌ను నిలిపివేయకుండా హెచ్చరించింది.


Read Also : Russia-India Ties : ఆపద వేళ రష్యాను ఆదుకున్న ఇండియా.. స్నేహమంటే ఇదేరా.. చూసి నేర్చుకోండి..

France : వైద్యం ముసుగులో కామపిశాచం.. 299 మంది రోగులపై అత్యాచారం చేసిన దుర్మార్గుడు.. ఎక్కడంటే..

Updated Date - Feb 25 , 2025 | 08:32 PM