Home » Manipur Violence
Internet Shut downs : ఇండియాలో మరోసారి ఇంటర్నెట్ స్వేచ్ఛపై చర్చ మొదలైంది. 2024లో ఇంటర్నెట్ షట్డౌన్లకు సంబంధించిన డిజిటల్ హక్కుల సంస్థ విడుదల చేసిన నివేదికలో విస్తుపోయే నిజాలు బయటికొచ్చాయి..
Manipur: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో.. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
మణిపూర్ విషయంలో బీజేపీ స్వప్రయోజనాలు చూసుకుంటోందని పదేపదే తాము బాధ్యతాయుతంగా చెబుతూ ఉన్నామని ఖర్గే తెలిపారు. మణిపూర్ హింసాకాండలో 250 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 60,000 మంది నిరాశ్రయులయ్యారని అన్నారు.
జాతుల వైరం సుదీర్ఘకాలంగా కొనసాగుతుండటంపై మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
Manipur: కొత్త ఏడాది మణిపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఆకాంక్షించారు. గతేడాది మే మాసం నుంచి రాష్ట్రంలో చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో తనను క్షమించాలని ఆయన రాష్ట్ర ప్రజలకు కోరారు.
మణిపూర్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. మణిపూర్ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని వారు డిమాండ్ చేశారు.
ఇంఫాల్ వ్యాలీలో మెయితీలు, కుకీల జాతుల మధ్య గతేడాది మే మాసంలో ఘర్షణ చెలరేగింది. దీంతో దాదాపు 250 మందికి పైగా మరణించారు. అలాగే ఈ హింస కారణంగా వేలాది మంది నిరాశ్రయులు కావడమే కాకుండా.. వందలాది మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస బాట పట్టారు.
మణిపూర్ ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విశ్వాసం కోల్పోయి, సొంత గడ్డపైనే అభద్రతా భావంతో గడుపుతున్నారని ఖర్గే తెలిపారు. ప్రధానమంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ తన ప్రాణాలు, ఆస్తులు కాపాడతారనే నమ్మకాన్ని వారు కోల్పోయారని రాష్ట్రపతి దృష్టికి ఆయన తెచ్చారు.
మణిపూర్లో శాంతిభద్రతల పరిస్థితి మరింత క్షీణించింది. నిరసనకారులు సోమవారం కర్ఫ్యూను ఉల్లంఘించి యథేచ్ఛగా అల్లర్లకు పాల్పడ్డారు.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతుండంతో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితిని అమిత్షా సమీక్షించడంతో పాటు, ఎలాంటి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు.