Home » Adani Group
అవినీతి ఆరోపణఓ్ల కూరుకుపోయిన వివాదాస్పద పారిశ్రామిక వేత్త అదానీని తానెన్నడూ కలుసుకోలేదని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కూడా కోరలేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) స్పష్టం చేశారు.
అదానీ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాత్రపై ఏపీ ప్రభుత్వం విచారణ చేయించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ స్కాంపై ఏసీబీతో విచారణ చేయించాలని కోరారు. ఈ స్కాంలో నిజాలు నిగ్గుతేల్చాలని అన్నారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీకి చెందిన ఓ కంపెనీ స్టాక్స్ 65 శాతం పెరగవచ్చని పలు బ్రోకరేజీ సంస్థలు లక్ష్యాన్ని అందించాయి. దీనిపై అనేక మంది పెట్టుబడిదారులు ఆసక్తితో ఉన్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
అదానీని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తుంటే రేవంత్ రెడ్డి రూ.100 కోట్ల చెక్కు ఎందుకు తీసుకున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. అదానీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు.
పార్లమెంట్ సమావేశాలు అయిదో రోజు కూడా ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. ప్రతిరోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాగానే అదానీపై అమెరికా చేసిన ఆరోపణలపై చర్చకు అనుమతి ఇవ్వాలని విపక్షాలు పట్టుపట్టాయి.
ఇది ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు, యూఎస్ న్యాయశాఖకు సంబంధించిన లీగల్ అంశమని ఎంఈఏ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అలాంటి కేసుల్లో నిర్దిష్ట విధానాలు, చట్టపరమైన మార్గాలు ఉంటాయని తెలిపారు.
శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండల పరిధిలోని పెద్దకోట్ల, దాడితోట గ్రామాల మధ్య జరుగుతున్న అదానీ హైడల్ పవర్ ప్రాజెక్టు పనులను బీజేపీ నాయకులు మూడు రోజుల క్రితం అడ్డుకున్నారు. మంగళవార జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
‘‘దేశంలోనే అతితక్కువ ధరకు సౌర విద్యుత్ యూనిట్ రూ.2.49కే సెకీ నుంచి సౌరవిద్యుత్తు కొనుగోలు చేసి, రాష్ట్రానికి మంచి చేస్తే శాలువా కప్పి సన్మానం చేయాలి కదా! అలా చేయకుండా నా వ్యక్తిత్వం మీద బురద జల్లడమేమిటి?’... అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్మయం, ఆగ్రహం, ఆక్రోశం వ్యక్తం చేశారు. అదానీపై అమెరికాలో పెట్టిన కేసులో తన పేరెక్కడుందని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలారా... వినండి! మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి శాలువాలు కప్పాలట! సన్మానాలు చేయాలట! రాష్ట్రానికి ఆయన లక్షల కోట్లు మిగిల్చారట! ఈ మాటలన్నీ ఎవరో చెప్పినవి కావు! ఆయనకు ఆయనే చెప్పుకొన్నారు. తనకు తాను జేజేలు కొట్టుకున్నారు.
ప్రపంచ ఆర్థిక నేరగాడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పరువెక్కడ ఉందని ఏపీ ఆక్వా కల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకట రమణా రెడ్డి ప్రశ్నించారు. ఆయన పరువు నష్టం దావా వేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని ఆనం వెంకట రమణా రెడ్డి విమర్శించారు.