Home » Anantapur urban
అక్కడున్న వారిలో చాలామంది పేద, మధ్యతరగతి కుటుంబాల వారే. దశాబ్దాల కాలంగా చిన్న చిన్న వ్యాపారాలు, కూలీపనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. రోడ్డు విస్తరణ కబురు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎలాంటి వార్తను వినాల్సివస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం అనంతపురం డిపోలో నూతనంగా వచ్చిన సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్ బస్సులను ఎమ్మెల్యే పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
ఢిల్లీ లో నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఎనఎ్సఎ్స విద్యార్థులు పాల్గొనన్నారు. ఈ మేర కు కేఎ్సఎన ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల నుంచి స్వప్న, కళ్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి శ్రీలత పాల్గొననున్నట్లు అయా కళాశాలల ప్రిన్సిపాల్స్ తెలిపారు.
శాస్త్రీయ పద్ధతిలోనే బయోమెడికల్ వ్యర్థ పదార్థాలను డిస్పోజ్ చేయాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు డీఎంహెచఓ డాక్టర్ ఈబీ దేవి ఆదేశించారు. శనివారం నగరంలోని యశోదా ఆస్పత్రిని ఆమె తనిఖీ చేశారు.
ప్రజల సేవకే నా జీవితం అంకితమని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల నడుమ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. శనివారం స్థానిక శ్రీనగర్ కాలనీలోని అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో అదనపు సీట్లను కేటాయించాలని ప్రజా సంఘాల నాయకులు కలెక్టర్ను కోరారు. బుధవారం కలెక్టర్ వినోద్ కుమార్ను కలిసి డి మాండ్లతో కూడిన విన తి పత్రాన్ని అందజేశా రు.
చేనేతలకు చేయూతనిచ్చేది సీఎం చంద్రబాబునాయుడేనని పద్మశాలి సంఘం నాయకులు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక క్లాక్ టవర్ సమీపంలోని చేనేత, జౌళి శాఖ కార్యాలయం వద్ద పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
జగనరెడ్డీ... అధికారం పోయినా నీ కుట్రలు మానవా..? అంటూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం అనంతపురం నగరంలోని నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
కృష్ణా, గోదావరి జలాల పునఃపంపిణీ జరగాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఆ సంఘం నాయకులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే చదువులు ప్రభుత్వాల చర్యలతో వారికి భారంగా పరిణమిస్తున్నాయని, దీనికి నివారించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని మానవ హక్కుల వేదిక రాష్ట్ర సభ్యులు చంద్రశేఖర్ అన్నారు.