Home » Anantapur urban
సీఎం చంద్రబాబు ప్రజాపాలన అందిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. సోమవారం స్థానిక రాం నగర్లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
నాలుగు నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నాం.. వెంటనే జీతాలు చెల్లించి ఆదుకోవాలని జిల్లా సర్వజన ఆస్పత్రిలో పారిశుధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజే్షగౌడు, మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది.
సూపర్ సిక్స్ పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. సోమవారం అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులు, పార్టీ నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఏఐటీయూసీ జాతీయ సమ్మేళనం పోస్టర్లను ఆ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఆదివారం ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బడా కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రుణాలను మాఫీ చేశారన్నారు.
అనంతపురం మున్సిపల్ కార్పొరేషనలోని స్కూళ్లలో టీచర్ల కొరత ఉందని, వెంటనే బదిలీలు చేపట్టాలని ఎస్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఆ సంఘం కార్యాలయంలో నగర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఎస్సీ వర్గీకరణ తీర్పుతో సమాన అవకాశాల సద్వినియోగ ప్రతిబంధకాల్ని సుప్రీం కోర్టు తెంచివేయడం హర్షణీయమని మాదిగల మేధావుల ఫోరం నాయకులు పేర్కొన్నారు. ఆదివారం ఫోరం ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం క్లాక్టవర్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఆ ఇద్దరు యువకులు తమ స్నేహితులతో కలిసి చేసిన సాయం ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. అనంతపురం నగరంలోని ఓ సెల్ పాయింట్కు చెందిన షంశుద్దీన, రోషన ప్రతి ఏడాది సహజసిద్ధ అందాలకు నిలయమైన వాయనాడ్కు వెళ్తుంటారు.
జూనియర్ కళాశాలలు, హాస్టళ్లు, డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏఐఎ్సఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజులు జీపుజాతా శనివారం ఆత్మకూరు ప్రభుత్వ హైస్కూల్లో ముగించారు.
జిల్లాలో ప్రసిద్ది చెందిన నసనకోట ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయంలో గత ఐదేళ్లలో జరిగిన దోపిడీపై విచారణ చేయించాలని ఆ గ్రామ పంచాయతీ ప్రజలు డిమాండ్చేశారు. దీనిపై వారు శనివారం వెంకటాపురంలో ఎమ్మెల్యే పరిటాలసునీతకు వినతిపత్రం అందజేశారు.
అమూల్ పాల రైతులకు న్యాయం చేయాలని సీపీఐ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున డిమాండ్ చేసారు. శనివారం పాల రైతులతో కలిసి కలెక్టరేట్కు వచ్చి కలెక్టర్ వినోద్కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు.