Home » AP Assembly Elections 2024
మంగళగిరి ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తాజాగా రెడ్ బుక్పై స్పందించారు. శుక్రవారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేశ్ మాట్లాడుతూ.. రెడ్ బుక్ ఎందుకు ఫేమస్ అయింది. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది తదితర వివరాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అంతేకానీ తామకు మంత్రి పదవులు ముఖ్యం కాదన్నారు. అయినా తమ పార్టీ పదవుల కోసం ఎప్పుడు సంప్రదింపులు జరపదని తెలిపారు.
ఎన్డీఏ కూటమిలో మంత్రివర్గంలో స్థానంపై భీమిలీ తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలోకి ఎవరెవర్ని తీసుకోవాలో టీడీపీ అధినేత చంద్రబాబే నిర్ణయిస్తారని అన్నారు.
ఈ పట్టణాన్ని అత్యాధునిక పట్టణంగా తీర్చిదిద్దుతానని తాడేపల్లిగూడం ప్రజలకు ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా ఆయన గెలుపొందారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన సెలవు పెట్టినట్లు తెలుస్తుంది. బుధవారం చంద్రబాబును సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఆయితే ఆయన తన రాజీనామా లేఖను మంగళవారం సాయంత్రమే సాధారణ పరిపాలన శాఖకు అందజేసినట్లు తెలుస్తుంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఫ్యాన్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో ఓటమికి అనేక కారణాలు ఉన్నా అందులో ఒక వ్యక్తి ప్రధాన కారణమని ప్యాన్ పార్టీ కేడర్లో ఓ అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది.
రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్తోపాటు నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో కూటమి ప్రభుత్వానికి ఎన్నారైల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ రవి వేమూరి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలంతా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మళ్లీ కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారనే ఓ చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తుంది. ఆ క్రమంలో ఆయన కింగ్ మేకర్గా వ్యవహరించే అవకాశాలు సైతం ఉన్నాయని సదరు సర్కిల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. ఆ రాష్ట్రంలోని లోక్సభ స్థానాల్లో సైతం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభంజనం సృష్టించింది.
తాజాగా వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసే ప్రభంజనం సృష్టించింది. మొత్తం పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో విజయం సాధించారు.