Home » Bandi Sanjay
Telangana: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నారు. కేదార్నాథ్ ప్రాంతంలో అయితే కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కేదార్నాథ్కు వెళ్లిన అనేక మంది యాత్రికులు వర్షాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అలాగే పలువురు తెలుగు యాత్రికులు కూడా కేదార్నాథ్ వద్ద వరదల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. క్లౌడ్ బరస్ట్, భారీ వర్షాల కారణంగా నడక మార్గం దెబ్బతిన్నది.
దేశంలోని మహిళలు, చిన్నారుల భద్రత కోసం వివిధ పథకాలు, కార్యక్రమాల కింద రూ.13,412 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. బుధవారం రాజ్యసభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
దేశంలో మహిళల భద్రత కోసం వివిధ పథకాలు, కార్యక్రమాల కింద కేంద్ర ప్రభుత్వం రూ.13,412కోట్లు ఖర్చు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లోక్ సభలో వెల్లడించారు. మహిళా భద్రతా పథకాల కింద మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపుల కేసులను నిర్వహించే పరిశోధకులతోపాటు ప్రాసిక్యూటర్ల సామర్థ్యం పెంపొందించేందుకు శిక్షణ ఇచ్చే నిబంధన ఉందా?, ఏయే కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటూ ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ బదులిచ్చారు.
‘‘పాతబస్తీ ఏమైనా ఒవైసీ జాగీరా?’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్పై మండిపడ్డారు.
మజ్లిస్ నేత అక్బరుద్దీన్కు దమ్ముంటే కొడంగల్ నుంచి పోటీ చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సవాల్ చేశారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటికో ఇన్చార్జిగా ఉండి ఆయనకు డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిస్తామని చెప్పారు.
బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అలాగే నగరంలోని జరుగుతున్న వివిధ ప్రాంతాల్లో బోనాల పండుగ ఉత్సవాల్లో బండి సంజయ్ పాల్గొననున్నారు.
డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టింది ఆర్థిక బడ్జెట్టా? లేక అప్పుల పత్రమా? స్పష్టం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.
తెలుగు రాష్ట్రాలలో ప్రతిష్టాత్మక సాంస్కృతిక, సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాల వేదికగా దశాబ్దాల ఖ్యాతిగాంచిన త్యాగరాయ గాన సభ.. కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు అభినందలు తెలియజేస్తూ మహోజ్వలమైన మూడు వందల ముప్పై పేజీల ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ ఇరవై ఐదవ ప్రచురణతో వచ్చేవారం మంగళాశాసనాలు సమర్పిస్తోంది. భారతీయ జనతాపార్టీ మహిళామోర్చా, ఆరెస్సెస్ మహిళా సేవికా సమితిలకు ఈ గ్రంధం వందల సంఖ్యలో పంచనుంది. ఇప్పటికే సుమారు యాభై పై చిలుకుగా అపురూప ధార్మిక గ్రంధాలను కధలుగా, స్తోత్రాలుగా, వ్యాఖ్యానాలుగా తెలుగులోగిళ్ళకు అందించిన జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం ప్రచురిస్తున్న ఈ గ్రంధాన్ని తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ ప్రోత్సాహంతో గానసభ అధ్యక్షులు జనార్ధనమూర్తి సౌజన్యంతో అందుతోంది. ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ అందించిన శ్రీవిద్యల రచనా సంకలనమే ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్’.
అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ హామీలను పూర్తిగా విస్మరించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై (Pawan Kalyan) టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) సంచలన విమర్శలు చేశారు. రైతులకు నష్టం జరుగుతుందని సినిమా తీసిన చిరంజీవి ఢిల్లీలో ధర్నా చేసిన అన్నదాతలకు ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు..