Home » Bhuvanagiri
ప్రధాని నరేంద్ర మోదీ మేనియాతో కేంద్రంలో మూడోసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉన్న కమలదళం నల్లగొండ స్థానంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది..
భువనగిరి ఎంపీ టికెట్ బీసీలకు కేటాయించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి(MLA Komati Reddy Raj Gopal Reddy) అన్నారు. శుక్రవారం నాడు మునుగోడు క్యాంపు కార్యాలయంలో రాజ్ గోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భువనగిరి ఎంపీగా తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి పోటీ చేయడం లేదని పోటీ కోసం దరఖాస్తు చేయలేదని తేల్చిచెప్పారు.
యాదాద్రి: జగత్కల్యాణ కారకుడు, భక్తజనబాంధవుడు, ఆర్తత్రాణపరాయణుడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
యాదాద్రి: తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కొండపై నిద్రించే సౌకర్యాన్ని ఆలయ అధికారులు కల్పించారు. కొండపైన డార్మెటరీ హాల్ను ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రారంభించారు.
యాదాద్రి: భక్తుల ఇలవేల్పు దైవం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నాల్గవ రోజు గురువారం ఉదయం వట పత్ర శాయి అలంకార సేవలో లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
యాదగిరిగుట్ట, మార్చి 10: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10గంటలకు ప్రధానాలయ ముఖ మండపంలో అర్చక, వేదపండితుల బృందం సంప్రదాయరీతిలో లక్ష్మీనృసింహుల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Telangana Results: భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర తిరగరాసింది. గత 40 ఏళ్లుగా భువనగిరిలో విజయం సాధించని కాంగ్రెస్.. ఈసారి పార్టీ జెండాను ఎగురవేసింది. భువనగిరిలో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన కుంభం అనీల్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు.
యాదాద్రి భువనగిరి: బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిందనే విషయాన్ని పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయని ఇక్కడున్న చిన్న దుకాణాలు, రైతులు, విద్యార్థులు, చిన్న చిన్న పనులు చేసుకునేవారు ఎంతో కష్టపడుతున్నారని ఈ విషయం తనకు తెలుసునని ఆమె అన్నారు.
యాదాద్రి: కార్తీకమాసం, ఆదివారం కావడంతో యాదగిరిగుట్టకు భక్తులరద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామి వారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది.