Home » Chaganti Koteswara Rao
ఆంధ్రప్రదేశ్: తిరుమల ఆలయ ఏర్పాట్ల విషయంలో తప్పుడు ప్రచారం చేయడంపై ఎస్వీ యూనివర్శిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల ఆలయంపై మూడు యూట్యూబ్ ఛానళ్లు తప్పుడు ప్రసారాలు చేశాయంటూ టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది.
ఏపీ ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది.
AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాగంటి కోటేశ్వరరావుకు మరో కీలక బాధ్యతను అప్పగించింది. ఇప్పటికే కేబినెట్ హోదాలో సలహాదారు పదవిలో ఉన్న చాగంటికి సర్కారు అప్పగించిన ఆ బాధ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం..
కాకినాడ సిటీ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): వచ్చే పదో తరగతి పరీక్షలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థుల నైతిక విలువల ప్రభుత్వ సలహాదారు, ఆధ్యాత్మిక ప్రవచన కర్త చాగంటి కోటేశ్వర రావు ఈనెల 28న విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఎంఎస్ఎన్ విద్యాసంస్థల డైరెక్టర్, యునైటెడ్ ప్రైవే
భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్తుతోపాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతమవుతుందని చెప్పారు.
అమోఘమైన తపశ్శక్తితో మన ఋషులందించిన మహత్తరమైన వేద సంపదను అనేక సత్యాలుగా స్తోత్ర, కథా అంశాలతో ఎన్నో తేజస్సులుగా అందిస్తున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తిరుమల శ్రీనివాసుని ఏకాగ్రంగా ఆరాధించడంవల్లనే అమృతశక్తుల అక్షర భారతులను ఎన్నో అందించగలుగుతున్నారని.. అలాగే అనతికాలంలోనే అనేక క్షేత్రాలకు, వేలకొలది భక్తులకు ఈ స్తోత్రరాజాలను సమర్పిస్తున్న కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య ధార్మిక సేవాసామర్ధ్యం ఆదర్శప్రాయమని తిరుమల, తిరుపతి ఆలయాలకు చెందిన అనేకమంది అర్చకులు, వేదపండితులు అభినందనలు వర్షిస్తున్నారు.
సర్వసమర్ధులైన ప్రజాపాలకుడు చంద్రబాబు పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుందని పలువురు రాజకీయకులతో ప్రస్తావిస్తున్న సీనియర్ తెలుగుదేశం నాయకులు, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య.. తనకి ఎంతో ఆత్మీయులైన ఆనం రామ నారాయణరెడ్డి విశేష రాజకీయానుభవం వున్న సంస్కారి అని, ఆనం పవిత్ర సేవలు ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరమని చెబుతూనే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తో చర్చలు జరిపి నెల్లూరు జిల్లాలోని మహా నృసింహ క్షేత్రమైన పెంచలకోన శ్రీ నరసింహ స్వామివారి దేవస్థానానికి సమర్పించేలా ఆనం రామనారాయణ రెడ్డి దంపతుల చిత్రాలొకవైపు ప్రచురిస్తూ.. పరమాద్భుతమైన నృసింహ ఉపాసనలతో ‘జయ జయ శత్రుభయంకర’ అనే గ్రంధాన్ని పరమ పవిత్రంగా ప్రచురించారు.
నాల్గవసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని... బుధవారం ఉదయం బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధానంలో పురాణపండ శ్రీనివాస్ రచనలైన మంగళగిరి నృసింహ భగవానునిపై ప్రచురించిన ‘నారసింహో... ఉగ్రసింహో’ దివ్యగ్రంధాన్ని, బెజవాడ కనకదుర్గా శక్తి స్వరూపంపై ప్రచురించిన ‘జయ జయోస్తు’ గ్రంధాన్ని సరస్వతీపుత్రులు, ఉపన్యాస కేసరి చాగంటి కోటేశ్వర రావు ఆవిష్కరించారు. ప్రఖ్యాత వైద్య విజ్ఞాన సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య ఈ సౌందర్య వంతమైన దైవబలాల గ్రంధాలను సౌజన్యభరితంగా సమర్పించారు.
పురాణపండ శ్రీనివాస్ భక్తి రసాత్మకంగా అందించిన లక్ష్మీనారసింహుని దివ్య సాన్నిధ్యం ‘ఉగ్రం ... వీరం’ అమోఘ గ్రంధంలో నృసింహావిర్భావ ఘట్టం గాథని చదివితే వొళ్ళు గగుర్పొడుస్తూ ఒక పవిత్ర అనుభూతి కలుగుతుందని....శ్రీనివాస్కి, ఆయన రచనా వైభవానికి ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కటాక్షం పుష్కలంగా ఉందని విఖ్యాత ప్రవచనకర్త, సరస్వతీపుత్రులు చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం పురాణపండ శ్రీనివాస్ రచనాసంకలనం ‘ఉగ్రం ... వీరం’ అపురూప గ్రంధాన్ని విజయవాడ దుర్గమ్మ దేవస్థాన ప్రత్యేక వేదికపై ఆయన ఆవిష్కరించారు
‘శ్రీ పూర్ణిమ’ పుస్తకాన్ని హక్కులతో కొనడానికి విజయవాడ, రాజమహేంద్రవరంకి చెందిన ప్రచురణకర్తలు పోటీపడుతున్నారు. అయితే గ్రంధానికి వ్యాపారపు నీడ తాకనివ్వని, రాజీపడని మనస్తత్వపు పురాణపండ శ్రీనివాస్ ప్రచురణకర్తలకు నిర్మొహమాటంగా మొండిచెయ్య చూపడం కొసమెరుపు.