28న విద్యార్థులకు చాగంటి ప్రవచనం
ABN , Publish Date - Dec 17 , 2024 | 12:51 AM
కాకినాడ సిటీ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): వచ్చే పదో తరగతి పరీక్షలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థుల నైతిక విలువల ప్రభుత్వ సలహాదారు, ఆధ్యాత్మిక ప్రవచన కర్త చాగంటి కోటేశ్వర రావు ఈనెల 28న విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఎంఎస్ఎన్ విద్యాసంస్థల డైరెక్టర్, యునైటెడ్ ప్రైవే

కాకినాడ సిటీ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): వచ్చే పదో తరగతి పరీక్షలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థుల నైతిక విలువల ప్రభుత్వ సలహాదారు, ఆధ్యాత్మిక ప్రవచన కర్త చాగంటి కోటేశ్వర రావు ఈనెల 28న విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఎంఎస్ఎన్ విద్యాసంస్థల డైరెక్టర్, యునైటెడ్ ప్రైవేటు ఎడ్యు కేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రాష్ట్ర లీగల్ అడ్వయిజర్ మతుకుమిల్లి శ్రీ విజయ్ ప్రవచన కర్త చాగంటిని మర్యాదపూర్వకంగా కలిసి వచ్చే ప దో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించా లని కోరగా అంగీకరించారు. కాకినాడ రాజాట్యాంక్ పార్కు వద్ద గల ఫ్యాబిన్ కన్వెక్షన్ హాల్లో ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్య క్రమం జరగనుంది.చాగంటిని శాలువాతో శ్రీవిజయ్ సత్కరింంచారు.