Home » CM Chandrababu Naidu
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో(TTD) ఎంతో పవిత్రమైన శ్రీవారి లడ్డూను(Tirumala Laddu) అపవిత్రం చేశారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీలోని చాలా జిల్లాలు చిగురుటాకులా వణికిన విషయం తెలిసిందే. వరదల ధాటికి చాలా మంది నిరాశ్రయులయ్యారు.
Andhrapradesh: ఈరోజు పలు కీలక శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షలు జరుపనున్నారు. రూరల్ వాటర్ సప్లై, జల్ జీవన్ మిషన్ మీద సమీక్ష చేయనున్నారు. అనంతరం సెర్ఫ్ పై సీఎం సమీక్ష చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఉచిత ఇసుక విధానంలో పోర్టల్ను ప్రారంభించనున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం నుంచి ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం అమలు కానుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉచిత ఇసుక పోర్టల్ను అవిష్కరించనున్నారు. దీంతో గ్రామ వార్డు సచివాలయాల్లో ఇసుక బుక్ చేసుకునే అవకాశం ఉంది.
అమరావతి: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘వైఎస్సార్ లా నేస్తం’ పేరు మార్పు చేస్తూ.. ‘న్యాయ మిత్ర’గా మార్చింది. లా డిపార్ట్మెంట్లో అమలవుతున్న ఈ పథకాన్ని ‘న్యాయ మిత్ర’గా మార్చాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలు నిర్ణీత సమయంలో జారీ చేయబడతాయని ఉత్తర్వుల్లో వెల్లడించింది.
వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను భ్రష్టుపట్టించారని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ నాణ్యత పడిపోయిందని సీఎం చంద్రబాబు వివరించారు. భక్తులు పవిత్రంగా భావించే లడ్డూలో జంతువుల నెయ్యి ఉపయోగించారని పేర్కొన్నారు. ఇప్పుడు స్వచ్చమైన ఆవు నెయ్యి ఉపయోగిస్తామని తెలిపారు.
ఇచ్చిన హామీ మేరకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సైనికుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసింది. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే హామీ నెరవేర్చారని మాజీ సైనికులు గుర్తుచేశారు.
సీఎం చంద్రబాబుపై(CM Chandrababu) అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచినప్పుడు షూటింగ్లకు వెళ్లలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు.
Andhrapradesh: వలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై ఏపీ కేబినెట్లో చర్చకు వచ్చింది. గతేడాది ఆగస్టులోనే వలంటీర్ల కాలపరిమితి ముగిసిందని ఈ సందర్భంగా అధికారులు కేబినెట్కు తెలియజేశారు. కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా నాడు వలంటీర్లతో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయించారని పలువురు మంత్రులు తెలియజేశారు.