Home » CM Chandrababu Naidu
YS Jagan Reacts on Tirumala Issue: తిరుమలలో నెయ్యి కల్తీ వివాదంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఇదంతా చంద్రబాబు అల్లిన కట్టుకథ అని ఆరోపించారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని.. తప్పుడు ఆరోపణలతో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.. ఇంకా చాలా కామెంట్స్ జగన్ చేశారు.. పూర్తి కథనం మీకోసం..
తిరుపతి లడ్డూ తయారీలో జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై ఈ రోజు సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్లతో చర్చించి చర్యలు తీసుకుంటామని అన్నారు. భక్తుల విశ్వాసాలను, ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Andhrapradesh: దేశ విదేశాల నుంచి తిరుమలకు భక్తులు వస్తారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. లడ్డూ ప్రసాదంలో బీఫ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ కలిసాయి అని చంద్రబాబు వెల్లడించారని.. ఇంత పెద్ద విషయం అంత సునయాసంగా ఎలా చెప్పారని ప్రశ్నించారు.
Andhrapradesh: నిత్యం పరదాల మాటున కాకుండా ప్రజల్లోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఉన్నారు. 100 రోజుల పాలనకు గుర్తుగా ఈరోజు నుంచి ఈ నెల 26 వతేది దాకా ' ఇది మంచి ప్రభుత్వం ' పేరుతో ప్రజల్లోకి ప్రజాప్రతినిధులు వెళ్లనున్నారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదమంటే ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తుంటారు. హిందూ భక్తులకు అది అత్యంత ఇష్ట ప్రసాదం. అలాంటి పవిత్రమైన ప్రసాదంలో ఎద్దు, పంది తదితర జంతువుల కొవ్వు పదార్థాలతో కల్తీ అయిన నెయ్యిని
ప్రకాశం జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. మద్దిరాలపాడు గ్రామంలో జరిగే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్నారు. 2.30 గంటలకు నాగులుప్పలపాడు మండలం, చదలవాడ చేరుకుంటారు.
ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక రంగానికి సంబంధించిన 38 విభాగాల్లో అవార్డులను అర్హులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రదానం చేయనున్నట్టు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
ఉచిత ఇసుక హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యక్తిగత అవసరాల కోసం వాగులు, వంకల నుంచి ఇసుకను పూర్తిగా ఉచితంగా తీసుకెళ్లవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. అమరావతిలో డ్వాక్రా మహిళల ఉత్పత్తుల ఎగ్జిబిషన్ కోసం 10 ఎకరాలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. అన్న క్యాంటీన్ల కోసం సుమారు రూ. 150 కోట్లు ఖర్చు అవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.