Home » Districts
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగు పెడితే పంచె విప్పి కొడతామని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. గెలిచినా, ఓడినా ఫ్యాక్షన మొదలు పెడతానని పెద్దారెడ్డి బహిరంగంగా చెప్పినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పెద్దారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఆయనతోపాటు ఆయన ఇద్దరు కొడుకులను జిల్లా నుంచి బహిష్కరించాలని డిమాండ్ చశారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే వైసీపీ హయాంలో ..
మిడ్ పెన్నార్ 5వ దక్షిణ కాలువ చివరి ఆయకుట్టు భూములకు నీరు అందక ఏకంగా మూడు దశాబ్దాలు అయింది. ఒకప్పుడు పండ్ల తోటలు, పచ్చని పైర్లతో కళకళలాడిన ప్రాంతం ఇప్పుడు దీన స్థితిలో ఉంది. వర్షాలు లేక, కాలువ నీరు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోరు బావులు నిర్వీర్యం కావడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. కొందరు రైతులు పెన్నా నదిలోకి కిలోమీటర్ల పొడవున పైప్లైన ఏర్పాటు చేసుకుని.. వర్షాకాలంలో సాగుకు నీటిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు...
జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఎస్పీ కేవీ మురళీకృష్ణ అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యం ఇస్తామని, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని తన చాంబర్లో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీ్సకాన్ఫరెన్స హాల్లో విలేకరులతో మాట్లాడారు. అనకాపల్లి ఎస్పీగా 15 నెలలు పనిచేశానని, ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపట్టామని అన్నారు. ప్రతిష్టాత్మకమైన అనంతపురం జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. తనకు అవకాశమిచ్చిన సీఎం చంద్రబాబు, డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ...
గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలలో కీలక ఘట్టాలు పూర్తయ్యాయి. జలధి కార్యక్రమం బుధవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి గ్రామోత్సవం అనంతరం తెల్లవారుజామున వెండిగొడుగులు సహా అగ్నిగుండ ప్రవేశం చేశారు. కుళ్లాయిస్వామి గోవిందా గోవింద అంటూ భక్తులు నినదించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అగ్నిగుండ ప్రవేశాన్ని తిలకించారు. స్వామివారు సాయంత్రం రెండోసారి అగ్నిగుండ ప్రవేశం చేశారు. అనంతరం భక్తులు విషాద వదనంతో, కన్నీరు కారుస్తూ గ్రామ సమీపంలోని బావిలో జలధి కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు దూర ప్రాంతాల నుంచి ...
కర్బూజ రైతులకు ఊజి ఈగ కన్నీరు తెప్పిస్తోంది. పిందె దశలోనే సోకి.. కాయకు రంద్రాలు పెడుతోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో కర్బూజను విస్తారంగా సాగు చేస్తారు. ఇక్కడి నుంచి ఢిల్లీ మార్కెట్కు కూడా దిగుబడిని తరలిస్తారు. కానీ ఊజి ఈగ దెబ్బకు పంట సాగు చేయాలంటే రైతులు భయపడుతున్నారు. కంటికి కనిపించని ఊజి ఈగ పిందె దశలోనే రంధ్రాలు పెట్టేసి, రసాన్ని పీల్చేస్తోంది. దీంతో ఆ కాయ పనికిరాకుండా పోతోంది. ఆకుల మధ్యలో, పంట చుట్టు పక్కల...
గూగూడు కుళ్లాయిస్వామి పెద్ద సరిగెత్తు వేడుక మంగళవారం కన్నులపండువగా సాగింది. క్షేత్రంలో కుళ్లాయిస్వామి, ఆంజనేయస్వామి దర్శనాల కోసం ఉదయం నుంచే భారీ క్యూ లైన్లు ఏర్పడ్డాయి. రాష్ట్ర నలుమూలల నుంచి, తెలంగాణ, కర్ణాటక, గోవా, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు గూగూడుకు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. ‘కుళ్లాయి స్వామి గోవిందా.. గోవింద..’ అనే నినదాలతో క్షేత్రం మార్మోగుతోంది. మొక్కుబడి ఉన్న కుటుంబాలవారు కాలిన ..
ఎలాంటి హడావుడి లేకుండా ఎస్పీ గౌతమి శాలి విధుల నుంచి మంగళవారం రిలీవ్ అయ్యారు. ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేయబోయినా.. ఆమె సున్నితంగా తిరస్కరించారు. జిల్లా పోలీసు సిబ్బంది, అధికారులు, ప్రజల సహకారం మరువలేనని ఆమె అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రిలీవ్ అవుతున్న సందర్భంగా పోలీస్ కాన్ఫరెన్స హాల్లో ఆమె మంగళవారం మాట్లాడారు. జిల్లాలో ఎస్పీగా అతి తక్కువ కాలం పని చేసినా తనకు సంతృప్తి కలిగిందని అన్నారు. జిల్లా...
ప్రజలకు.. ప్రభుత్వానికి వారధిలా వలంటీర్లు సేవలు అందిస్తున్నారని వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఊదరగొట్టారు. కానీ అడ్డదారిలో ప్రభుత్వ పథకాలను అందుకున్నారని నెమ్మదిగా బయట పడుతోంది. అర్హత లేకున్నా సదరం సర్టిఫికెట్లు తెచ్చుకుని పలువురు అక్రమంగా పింఛన్లు పొందారు. తమ పేరిట, తమ కుటుంబ సభ్యుల పేరిట వలంటీర్లు అక్రమాలకు పాల్పడ్డారు. వీరితోపాటు పలువురు వైసీపీ నాయకులు అర్హత లేకున్నా పింఛన్లు అందుకున్నారు. అధికారులపై ...
‘ముడుపులు కావాలా..? జరిమానా కట్టాలా..? ఏదో ఒకటి నిర్ణయించుకోండి. నెల నెలా వచ్చి మామూళ్లు తీసుకుపోతారు. మళ్లీ తనిఖీలకు వచ్చి జరిమానా విధిస్తారు. ఇట్లైతే కుదరదు. ఏదో ఒక్కటే చెల్లిస్తాం. డిసైడ్ చేసుకోండి..’ అని సా మిల్లుల యజమానులు అటవీశాఖలోని ‘మామూలు’ అధికారులకు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం సా మిల్లులు నిర్వహించుకుంటామని, తమ వైపు తప్పు ఉంటే జరిమానాలు కట్టేందుకు సిద్ధమని అంటున్నారు. వారి తిరుగుబాటుతో అటవీశాఖ అనంతపురం రేంజ్ పరిధిలో జరుగుతున్న అక్రమాలు బయట పడుతున్నాయి. అటవీ శాఖ జిల్లా ...
వేసవి సెలవులు ముగిసిన తర్వాత విద్యాలయాలు ప్రారంభమయ్యి నెల రోజులు దాటింది. అయితే కణేకల్లు మోడల్ స్కూల్ ప్రినిపాల్ మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. జూనియర్ కళాశాలలు జూన ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటి వరకూ ఆయన స్కూల్కు వచ్చిన దాఖలాలు లేవు. ఆయన రాకున్నా వచ్చినట్టు సంతకాలు మాత్రం ఉంటాయి. అటెండెన్స రిజిస్టర్లో సైతం ప్రిన్సిపాల్ సంతకాలు ఉంటాయి. ...