Home » Election Campaign
మండలంలోని పాలసముద్రం ప్రాంతం ప్రపంచ పటంలో గుర్తింపు వచ్చేలా చేసిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుదే అని టీడీపీ కూట మి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. గోరంట్ల మం డలంలోని పాలసముద్రం, వడిగేపల్లి, రెడ్డిచెరువుపల్లి పంచాయతీ గ్రామాల్లో రోడ్షో ద్వారా సవిత శనివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాల సముద్రంలో పెద్దఎత్తున జనం తరలివచ్చి గజమాల లు, హారతులు, పూల వర్షంతో ఆమెకు ఘనస్వాగతం పలికారు.
ఎన్నికల్లో సైకిల్గుర్తుకు ఓటువేసి అభివృద్ధికి పట్టం కట్టాలని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని ఆలూరు, సజ్జలదిన్నె, బుగ్గ, ఇగుడూరు, చుక్కలూరు గ్రామాల్లో శనివారం ఆయన రోడ్షో, బహిరంగ సభలు నిర్వహించారు.
న్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణకు రెండు ఓట్లు వేసి గెలిపించాలని గుమ్మనూరు జయరాం ఓటర్లను అభ్యర్థించారు. శనివారం ఉదయం పట్టణంలోని 6, 7, 8, 26 వార్డుల్లో ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు.
రైతుల భూములను కబ్జా చేయడానికి జగన అమలు చేసేందుకు సిద్ధమైన ల్యాండ్ టైటిల్ చట్టాన్ని తెలుగుదేశం అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. గొల్లపల్లి, గలగల, పైదొడ్డి, కేపీదొడ్డి, రంగసముద్రం, తాళ్లకెర, గుమ్మఘట్ట, గోనబావి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రోడ్షో నిర్వహించారు.
కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటిస్థానంలో నిలుపుతామని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. శనివారం మండలంలోని గూబనపల్లి, దొడఘట్ట, కురాకుల పల్లి, ఒంటిమిద్ది, ముదిగల్లు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాలలో అమిలినేనికి పూలవర్షం కురిపించి గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో అవసరమైన మౌలిక వసతులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు.
ఫ్రీ బస్సు పథకం సంతోషమే కానీ.. దాని వల్ల ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన మంచిర్యాల రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్కు పట్టుమని 10 రోజులు కూడా సమయం లేదు. గెలుపు కోసం రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని హోరెతిస్తున్నాయి. హాట్ హాట్గా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో కూటమి తరపున ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో ఎన్నికల ప్రచారానికి విచ్చేస్తున్నారు.
Telangana: తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు మరో వారం రోజుల సమయమే ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార జోరును మరింత పెంచింది. కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణకు రానున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రెండు సార్లు రాష్ట్రంలో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించేలా కాంగ్రెస్ శ్రేణులు షెడ్యూల్ను రూపొందించింది.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సభలో అపశృతి చోటు చేసుకుంది. శనివారం జిల్లాలోని పలమనేరులో సీఎం జగన్ సభ నిర్వహించారు. అయితే జగన్ సభకు హాజరైన ప్రజల్లో పలువురు అస్వస్థతకు గురయ్యారు. సభకు వచ్చిన జనానికి వైసీపీ శ్రేణులు చల్లని పానీయాలు పంపిణీ చేశారు. అయితే వీటిని తాగిన పలువురకి అనారోగ్యం పాలయ్యారు. వాంతులు అవడంతో వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Andhrapradesh: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం వాకర్స్తో, ముఠా కార్మికులతో సుజనా భేటీ అయ్యారు. ముఠా కార్మికుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. వారిని ఆర్ధికంగా బలోపేతం చేసేలా, ఉపాధికి మార్గాలు చూపే బాధ్యత తనది అంటూ భరోసా ఇచ్చారు.