Home » Election Commission
వైసీపీ వీరవిధేయుడిగా గుర్తింపు పొందిన అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై బదిలీ వేటు పడింది. కిందిస్థాయి అధికారికి తక్షణమే బాధ్యతలు అప్పగించి, పోలీస్ హెడ్క్వార్టర్స్లో రిపోర్ట్ చేసుకోవాలని డీజీపీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం రూరల్ మండలం రామక్రిష్ణ కాలనీలో వైసీపీ ఎంపీటీసీ భర్త నగే్షపై జరిగిన దాడి ఘటనలో సంబంధం లేనివారిని కేసులో ఇరికించారని డీఎస్పీపై ఆరోపణలు ...
ఏపీ సార్వత్రిక ఎన్నికలు (AP Election 2024) ఈనెల 13వ తేదీన జరుగుతుండటంతో.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రకియను ఎన్నికల సంఘం (Election Commission) చేపట్టింది. ఈ పోస్టల్ బ్యాలెట్లో గందరగోళం నెలకొంది. చాలా మంది ఉద్యోగులకు సకాలంలో డ్యూటీ పాస్లు అందలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 16 నెలలు జైల్లో ఉన్న ఆర్ధికనేరస్తుడు సీఎంగా ఉన్నారన్నారు. జగన్ ఆర్థిక నేరస్తుడని ఆయన అఫిడవిట్ చెప్తుందన్నారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ జగన్ బాటలో నడుస్తున్నారని ఆరోపించారు.
మహిళలపై అసభ్యకరమైన ప్రచారం చేస్తున్న వైసీపీ కార్యకర్తలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదికను ఇవ్వాలంటూ ఏపీ డీజీపీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వివరణ ఇవ్వాల్సిందిగా డీజీపీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశించారు. టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి ఫిర్యాదుపై ఈసీ స్పందించింది.
ఎన్నికల సంఘాన్ని (Election Commission) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలు శుక్రవారం కలిశారు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు ఏపీ పోలీసులపై టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య ఫిర్యాదు చేశారు. పోలీసు వాహనాలను ప్రజా రక్షణకు వాడాలని.. సీఎం జగన్ (CM Jagan) అవినీతి సొమ్ము ఓటర్లు చేరవేయడానికా వాడడం ఏంటని ప్రశ్నించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) ఈ నెల 13న జరుగుతుండటంతో అధికార వైఎస్సార్సీపీ (YSRCP) పలు అక్రమాలకు పాల్పడుతోంది. మరోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని పలు కుట్రలకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే కొంతమంది అధికారులు జగన్ పార్టీకి తొత్తులుగా మారారనే ఆరోపణలు వస్తున్నాయి.
బడాబాయ్(మోదీ), చోటాబాయ్(రేవంత్రెడ్డి) కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన ఆరాోపణలు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కూడా అచ్చంగా బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందని విమర్శించారు. బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఏపీలో మే-13న సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) జరుగుండటంతో ఎన్నికల సంఘం (Election Commission) పలు నిబంధనలను విధించిన విషయం తెలిసిందే. అయితే.. అధికార వైసీపీ మాత్రం ఆ నియమాలను పాటించకుండా తుంగలో తొక్కుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..
గాజు గ్లాసు గుర్తు ఎలా వచ్చిందో తనకు తెలుసునని.. స్థానిక నేతల వత్తిడితోనే కొంతమంది అభ్యర్థులకు ఎన్నికల అధికారులు ఆ గుర్తు కేటాయించారని జగ్గంపేట ఉమ్మడి పార్టీల అభ్యర్థి జ్యోతుల నెహ్రూ (Jyothula Nehru) తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోకు...సీఎం జగన్ (CM Jagan) మేనిఫెస్టోకు చాలా తేడా ఉందని చెప్పారు. జగన్ మేనిఫెస్టోను చూస్తే అతని మనస్సు ఏంటో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
ఏడు విడతల లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇంతవరకూ రెండు విడతల పోలింగ్ పూర్తికాగా, ఈ రెండు విడతల్లో పోలింగ్ శాతాన్ని అధికారికంగా భారత ఎన్నికల సంఘం మంగళవారంనాడు విడుదల చేసింది. ఏప్రిల్ 19న జరిగిన తొలి విడతలో 66.14 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలిపింది. ఏప్రిల్ 26న జరిగిన రెండో విడతలో 66.71 శాతం నమోదైనట్టు వెల్లడించింది.