Home » Exams
పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 51 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వచ్చేనెల 3న ప్రారంభమవుతున్న ఈ పరీక్షలు పదిరోజుల పాటు కొనసాగనున్నాయి.
బీఎస్సీ నర్సింగ్లో ప్రవేశాలకు సంబంధించిన కామన్ ఎంట్రెన్స్ పరీక్ష అటకెక్కినట్టేనా? చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ఈ పరీక్ష నిర్వహణపై వైద్యశాఖ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి.
మీరు CSIR యూజీసీ నెట్(CSIR UGC NET June 2024) కోసం అప్లై చేయాలని చూస్తున్నారా. అయితే వెంటనే ఈరోజు దరఖాస్తు చేయండి. ఎందుకంటే దీని కోసం అప్లై చేసేందుకు నేడే చివరి తేదీ. అయితే ఈ ఎగ్జామ్ కోసం అప్లై చేసేందుకు ఫీజు ఎంత, పరీక్ష ఎప్పుడుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ వెల్లడైంది. ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి మొత్తం మూడు దశల్లో కౌన్సెలింగ్ను నిర్వహించనున్నారు. ఈమేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన అడ్మిషన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మునిసిపాలిటీ పరిధిలోని కోవెలగుట్టపల్లికి చెందిన గొల్ల శ్రీకాంత్ కుమార్ యాదవ్ ఇటీవల జరిగిన సీఎంఏ (కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంట్స్) పరీక్షల్లో జాతీయస్థాయి మొదటి ర్యాంకు సాధించారు.
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం (24వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్3వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం (24వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్3వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
తెలంగాణ(telangana)లో గ్రూప్ 1 ఎగ్జామ్స్, స్టాఫ్ సెలక్షన్ పరీక్షల నేపథ్యంలో పీజీఈసెట్(PGECET 2024) ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో పీజీఈసెట్ 2024 పరీక్షల షెడ్యూల్ తేదీల్లో మార్పులు చేసినట్లు కన్వీనర్ డాక్టర్ ఏ అరుణ కుమారి ప్రకటించారు.
పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీపీజెట్ పరీక్షలను జూలై నెలలో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిలు సీపీజెట్ షెడ్యూల్ను విడుదల చేశారు. దాని ప్రకారం ఈనెల 18 నుంచి వచ్చేనెల 17వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.500 ఆలస్య రుసుముతో జూన్ 25 వరకు, రూ.2 వేల ఆలస్యరుసుముతో జూన్ 30 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. జూలై 5వ తేదీ నుంచి సీపీజెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
నిమిషం లేటు నిబంధన.. ఎడతెరిపి లేని వానతో టీఎస్ ఎప్సెట్కు తొలిరోజు హాజరైన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఎంబీబీఎస్, ఆయుష్, బీడీఎ్సలో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది పైచిలుకు విద్యార్థులు హాజరైనట్లు సమాచారం. ఈసారి ప్రశ్నపత్రం చాలా కఠినంగా ఉందని,