Share News

TG: పది సప్లిమెంటరీ పరీక్షలకు 51 వేల మంది విద్యార్థులు

ABN , Publish Date - May 28 , 2024 | 06:21 AM

పదవ తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 51 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వచ్చేనెల 3న ప్రారంభమవుతున్న ఈ పరీక్షలు పదిరోజుల పాటు కొనసాగనున్నాయి.

TG: పది సప్లిమెంటరీ  పరీక్షలకు 51 వేల మంది విద్యార్థులు

పదవ తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 51 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వచ్చేనెల 3న ప్రారంభమవుతున్న ఈ పరీక్షలు పదిరోజుల పాటు కొనసాగనున్నాయి. 31,625 మంది బాలురు, 19,612 మంది బాలికలు ఈ పరీక్షల కోసం ఫీజు చెల్లించారు. ఈ మేరకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 170 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. 170 మంది డిపార్ట్‌మెంటర్‌ అఽధికారులను, 1300 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. హాల్‌ టికెట్లను ప్రధానోపాధ్యాయుల నుంచి పొందవచ్చని, ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంచామని అధికారులు చెప్పారు.

Updated Date - May 28 , 2024 | 06:21 AM