Home » Flood Victims
అసోంలో వరదల(Assam floods) పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత కొన్ని రోజులుగా భారీ వరదలతో అల్లాడుతున్న అసోం ప్రజలు తాత్కాలిక శిబిరాల్లో నివసిస్తున్నారు. ఈ వరదల్లో ఇప్పటివరకు 38 మంది మృత్యువాత చెందగా, గత 24 గంటల్లో వరద నీటిలో మునిగి ముగ్గురు వ్యక్తులు మరణించారు.
పొరుగున ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల(Heavy Rains) కారణంగా అసోంలో వరదలు పోటెత్తుతున్నాయని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ(Himanta Biswa Sarma) సోమవారం తెలిపారు. బ్రహ్మపుత్ర దాని ఉపనదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తుండటం వల్ల అమెరికాలో వరదలు తీవ్రరూపం దాల్చాయి. ఈ దెబ్బకు ఐయోవా, సౌత్ డకోటా, మిన్నెసోటా, నెబ్రోస్కా రాష్ట్రాలు వరద బీభత్సంతో...
అసోం వరదల్లో మృతుల సంఖ్య 37కు చేరింది. మరొకరు గల్లంతయ్యారు. సుమారు 4 లక్షల మంది వరద ప్రభావానికి గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా హిమాలయ రాష్ట్రమైన సిక్కింలో 6 మంది మృతి చెందారు. 2 వేల మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వారిలో 800 మందిని అధికారులు రక్షించారు.
రెమాల్ తుపాన్ కారణంగా భారీ వర్షాలు, వరదలతో ఈశాన్యంలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఆ క్రమంలో అసోంలో కురిసిన భారీ వర్షాలకు, వరదలకు మరణించిన వారి సంఖ్య 25కు చేరింది.
భారీ వర్షాలు కురిస్తే పట్టణంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో భారీ వర్షా లంటేనే ఆ ప్రాంత ప్రజలు భయాం దోళ చెందుతున్నారు. రెండేళ్ల కిందట తాము పడిన అవస్థలు వారింకా మ రువలేదు. ఇదిలా ఉండగా రానున్న నాలుగు రోజుల్లో ఉమ్మడి అనంత జి ల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అనంత కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. అయితే పర్యాటక ప్రాంతాలుగా ఉన్న జలాశయాల వద్ద అధికారులు సరైన భద్రతాచర్యలు తీసుకోకపోవడంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా తమిళనాడులో జలాశయానికి వరద పోటెత్తడంతో 16 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
భారీ వర్షాలు వరదలతో అఫ్గానిస్తాన్లో మరణించిన వారి సంఖ్య 315కి పెరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. మరో పదహారు వందల మంది గాయాలపాలైయ్యారని వెల్లడించాయి. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పేర్కొన్నాయి.
అఫ్గానిస్థాన్లో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. దీంతో 200 మందికి పైగా ప్రజలు మరణించారని ఐక్యరాజ్య సమితి శనివారం వెల్లడించింది. దీంతో ఉన్నతాధికారులు ఎమర్జెన్సీని ప్రకటించారని తెలిపింది.