Home » Flood Victims
విజయవాడలోని వరద బాధితులకు నిత్యావసర సరుకుల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది.
వరదలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సాయం అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. దాంతో కేంద్ర హోం శాఖ రంగంలోకి దిగింది. సహాయక చర్యల్లో పాల్గొంది. తెలుగు రాష్ట్రాలకు అందజేసిన వరద సాయం గురించి హోం శాఖ శుక్రవారం సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేసింది.
వరద బాధితుల కోసం ప్రత్యేక యాప్ తీసుకువస్తున్నట్లు సీఎం చంద్రబాబు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ యాప్ వివరాలను ఐటీ ప్రత్యేక బృందం వివరించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కలిసి ఆయన పర్యటిస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం.. ప్రజల్లోకి వెళ్లి వారి పరిస్థితిని శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
Telangana: భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తాయి. కుండపోత వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి వర్ణణాతీతం. వరదలకు ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. పంటల పొలాలు నీటమునిగి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.
విజయవాడలో వరదలకు ప్రాణనష్టంతోపాటు ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగింది. ముఖ్యంగా ఇంటి సామగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయాయి. వీటితోపాటు వేల సంఖ్యలో కార్లు నీట ముగిని దెబ్బతిన్నాయి. దీంతో వాటి రిపేర్లకు యజమానులు నానావస్థలు పడుతున్నారు.
చిన్న వ్యాపారులు, చిరుద్యోగులు, రోజువారీ కూలీలు... ఇంకా ఎందరెందరో సామాన్య, పేద, దిగువ మధ్య తరగతి జీవులు! బుడమేరు వరద వీరి బతుకులను ముంచేసింది!
ఏ.శివకుమార్రెడ్డి రూ.1.50 కోట్లు, ఇ.చంద్రారెడ్డి రూ.50 లక్షలు, గుడివాడ విశ్వభారతి ఇన్స్టిట్యూషన్స్ రూ.30 లక్షలు, బృందావన్ మీటింగ్ ఏజన్సీస్ రూ.25 లక్షలు, వెలగపూడి శంకర్రావు రూ.25 లక్షలు, మదన్మోహన్రావు రూ.25 లక్షలు, కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ రూ.10 లక్షలు...
వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రాష్ట్ర ప్రజలను, ప్రత్యేకంగా విజయవాడ వాసులను ఆదుకునేందుకు ప్రభు త్వ ఉద్యోగులు, వివిధ పరిశ్రమలు, దాతలు, రాజకీయ నేత లు, ప్రజలు స్పందిస్తున్నారు.
‘అన్నా... నా బండి రిపేర్ చేయ్యాలి. అర్జెంటు అన్నా. ఇది లేకపోతే ఉద్యోగమే లేదు.’ ‘ఇప్పుడు కాదన్నా. కనీసం 10 రోజులు పడుతుంది. చాలా బళ్లు ఉన్నాయి.’ ఇది ఇప్పుడు బెజవాడ నగరంలో మెకానిక్లకు, బైక్ యజమానులకు మధ్య జరుగుతున్న సంభాషణ.