Home » Flood Victims
వరద ప్రాంతాల్లో ఈ నెల కరెంటు బిల్లుల వసూలు వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 33కు చేరింది. ఎన్టీఆర్ జిల్లాలోనే 25 మంది మరణించారు. గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు చనిపోయారు. ఎన్టీఆర్ జిల్లాలో గల్లంతైన ఇద్దరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.
విధులు నిర్వర్తిస్తూ వరదలో కొట్టుకుపోయి మరణించిన లైన్మెన్ వజ్రాల కోటేశ్వరరావు కుటుంబానికి రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రూ.25 లక్షలు అందజేశారు.
ముంపులో మునిగి, బురద పేరుకుపోయి కష్టాల కడలిలా మారిన వరద బాధిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా సర్కారు ముమ్మర చర్యలు తీసుకుంటోంది. సహాయ చర్యల్లో వేగం పుంజుకొంది.
భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి వీలైనంత సాయం అందించేందుకు కృషి చేస్తానని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. వ
కృష్ణానది, బుడమేరు వరద ఎన్టీఆర్ జిల్లా పరిధిలో అపార నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ప్రాథమిక అంచనా ప్రకారం నష్టం రూ.1,000 కోట్ల వరకూ ఉంటుంది.
వరద నష్టం అంచనాలు అందగానే కేంద్ర ప్రభుత్వం తన వంతు సాయం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలను అందిస్తారన్నారు.
బుడమేరు వాగుకు పడిన గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చడానికి ఆర్మీ బృందం వస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గురువారం రాత్రి విజయవాడ కలెక్టరేట్ ఆవరణలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.
బుడమేరు ముంపుతో తలెత్తిన భారీ వరదలకు ప్రధాన కారణం ఏంటనే విషయంపై సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇరిగేషన్ అధికారులను వెంటబెట్టుకుని విజయవాడ రూరల్ మండలంలోని ఎనికేపాడు గ్రామంలో ఆకస్మికంగా ఆయన పర్యటించారు.
గోదావరి వరద పెరుగుతుండడంతో కోనసీమలోని లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయగా ధవళేశ్వరం వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దాంతో కోనసీమలోని గౌతమీ, వశిష్ఠ, వైనతేయ, వృద్ధగౌతమీ నదీపాయలు పొంగి ప్రవహించడం వల్ల సమీపంలోని లంక గ్రామాల్లోకి వరదనీరు చేరుతోంది.