Home » Ganesh Nimajjanam
వినాయక చవితి పర్వదినం సందర్భంగా గత ఐదు రోజులుగా పూజలందుకున్న వినాయకుడి విగ్రహాలను బుధవారం నిమజ్జనానికి గంగమ్మ ఒడికి తరలించారు.
గతేడాది జరిగినట్లుగానే ఖైరతాబాద్ గణేషుడి(Khairatabad Ganesha) విగ్రహం నిమజ్జనాన్ని మధ్యాహ్నంలోపు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(Hyderabad City Police Commissioner CV Anand) స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం ఖైరతాబాద్ బడా గణేషున్ని దర్శించుకున్న సీపీ ప్రత్యేక పూజలు చేశారు.
హుస్సేన్ సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనాలను చేసుకోవచ్చా అని భక్తులకు సందేహం ఉండేది. ఈ సందేహాలపై హైకోర్టు స్పష్టత ఇచ్చింది. సాగర్లో మట్టి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను మాత్రమే నిమజ్జనాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
హైదరాబాద్ సిటీ పరిధిలో పండుగలు, ఈవెంట్లలో నిర్వహించే బందోబస్తు క్వార్టర్, సెమీఫైనల్స్ లాంటివి అయితే.. గణేష్ బందోబస్తు ఫైనల్స్ వంటిదని హైదరాబాద్ సిటీ పోలీస్కమిషనర్ సీవీ ఆనంద్(Hyderabad City Police Commissioner CV Anand) అన్నారు.
సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో వేంపల్లె గ్రామానికి చెందిన వారు మొగమోరువంక వద్దకు గణేశ విగ్రహాన్ని తెచ్చారు. దీనిని నిమజ్జనం చేస్తుండగా వేంపల్లెకు చెందిన బేల్దారి జారిపాటి రాజా (36), క్రిస్టియన కాలనీకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ వంశీ (25) ప్రమాదవశాత్తు వంకలో పడిపోయారు.
నగరంలో జరిగే గణేష్ నిమజ్జనోత్సవానికి హైదరాబాద్ సిటీ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా, సరూర్నగర్ మినీ ట్యాంక్ బండ్పై వినాయక విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. నిమజ్జనం ఏర్పాట్లను రాచకొండ సీపీ సుధీర్ బాబు ఈరోజు(సోమవారం) పరిశీలించారు.
విఘ్నాలను తొలగించే మహా నాయకుడు వినాయకుడు. వినాయక చవితి నాడు గణనాథుని ప్రతిమ ప్రతి ఇంట్లో కొలువు తీరుతుంది. ఏకదంతుడి పూజను ఆధ్యాత్మిక సౌరభాలతో, ఆనందోత్సాహాలతో చేసుకుంటారు. ఈ పూజలో అనేక పత్రాలను ఆయనకు సమర్పిస్తారు.
గణేష్ మండపాల నిర్వాహకులు ముందస్తుగా అనుమతి తీసుకుంటే ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ ధర రూ.27 లక్షలు పలికింది. తుర్కయంజాల్కు చెందిన దాసరి దయానందరెడ్డి రెడ్డి బాలపూర్ గణేష్ లడ్డూను కైవసం చేసుకున్నాడు. అంతకుముందు బాలాపూర్ గణేష్ శోభాయాత్ర వైభవంగా జరిగింది. బాలాపూర్ పురవీధుల్లో ఊరేగింపుగా సంస్కృతి కార్యక్రమాలు, భజనలతో శోభాయాత్ర శోభాయామానంగా సాగింది.
భాగ్యనగరం హైదరాబాద్లో ఎక్కడ చూసిన వినాయక నిమజ్జనం సందడి కనిపిస్తోంది. 10 రోజులపాటు విశేష పుజాసేవలు అందుకున్న గణనాథులు.. వెళ్లొస్తానంటూ నిమజ్జనానికి కదిలివెళ్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి విగ్రహాలు ఊరేగింపు సందడిగా మొదలైంది.