Home » Harish Rao
పోలీసులకు సరెండర్, అడిషనల్ సరెండర్ లీవ్ బెనిఫిట్ కింద అందించే డబ్బులు అన్ని జిల్లాల ఉద్యోగులకు విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కమార్కను డిమాండ్ చేశారు.
‘ఇచ్చిన మాటకు కట్టుబడి ఎమ్మెల్యే హరీశ్రావు(MLA Harish Rao) రాజీనామా చేయాలి. సిద్దిపేటలో నీ మీద నేనే పోటీ చేస్తా. నేను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఓడిపోతే నువ్వు కూడా తప్పుకుంటావా’ అని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు(Mainampalli Hanumantha Rao).. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావుకు సవాల్ విసిరారు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్కు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఛాలెంజ్ చేశారు. ‘తెలంగాణ, సిద్దిపేట.. నీ యబ్బ జాగీరా..? రుణమాఫీ 200 శాతం అమలు చేస్తున్నాం.. హరీశ్.. మరీ నీ సంగతి ఏంది..? మైనంపల్లి పీడ పోవాలంటే నువ్వు రాజీనామా చెయ్యి. నువ్వు రాజీనామా చేస్తే ఎన్నికల్లో నేనూ పోటీ చేస్తా..’ అని సవాల్ చేశారు..
తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేసిన రుణ మాఫీపై ఇంకా రాద్ధాంతం నడుస్తూనే ఉంది. 40 శాతం మందికి రుణమాఫీ జరగలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. ఆధార్, బ్యాంక్ అకౌంట్లు లాంటి సమస్యలతో నిలిచిపోయిన విషయం వాస్తవమేనని రేవంత్ సర్కార్ చెబుతున్న పరిస్థితి. ఈ క్రమంలో ఎల్లుండి (ఆగస్టు-22న) రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ధర్నాలకు పిలుపునిచ్చింది...
Telangana: రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.31 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేసినట్టు చెప్పడం హాస్యాస్పదమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తలాతోక లేకుండా రోజుకో తీరుగా మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు.
రుణమాఫీ కాలేదని అంటే రైతులను అరెస్టు చేస్తారా..? అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు.
కాంగ్రెస్ రైతు రుణమాఫీ పేరుతో ప్రజలను నట్టేట ముంచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు(Harish Rao) విమర్శించారు. రుణమాఫీ కాలేదన్న కారణంతో రైతులను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు.
‘‘కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులే రుణమాఫీ కాలేదని అంటున్నారు. అలాంటప్పుడు ఎవరు రాజీనామా చేయాలో..? ఎవరు ఏట్లో దూకి చావాలో..?
రుణమాఫీ అంశం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణకు దారి తీసింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఫ్లెక్సీల వార్ నడిచింది.
కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న రూ.2 లక్షల రుణమాఫీ.. రాష్ట్రంలో 54 శాతం మంది రైతులకు అందలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.