Home » Jagan Mohan Reddy
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 20రోజులు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్(APSFL) సంస్థకు మాత్రం ఇంకా మాజీ ముఖ్యమంత్రి జగన్ మత్తు వదిలినట్లు లేదు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినా టీవీ ఆన్ చెయ్యగానే నేటికీ ముఖ్యమంత్రిగా జగన్, మంత్రిగా అమర్నాథ్, APSFL ఛైర్మన్గా గౌతం రెడ్డి ఫొటోలు ప్రత్యక్షం అవుతున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) కాన్వాయ్(convoy)కి ప్రమాదం తృటిలో తప్పింది. కాన్యాయ్లోని రెండు కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం తాడిగొట్ల(Tadigotla) వద్ద కాన్వాయ్లోని ఫైర్ వాహనాన్ని వెనక నుంచి ఇన్నోవా కారు ఢీకొట్టింది.
గత వైసీపీ (YSRCP) ప్రభుత్వంపై హోం మంత్రి వంగల పూడి అనితకు (Vangalapudi Anitha) బాపట్ల జిల్లాలోని వేటపాలెం మండలం రామాపురం మత్స్యకారులు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం వద్ద హోంమంత్రి కాన్వాయ్కి అడ్డంగా వచ్చి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
తాడేపల్లి(Tadepalli)లో నిర్వహించిన వైసీపీ(YSRCP) విస్తృతస్థాయి సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్(Jagan) మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రావాల్సి వస్తుందనే బాధ ఆయన మాటల్లో కనిపిస్తోందని కలిశెట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని కేంద్ర బొగ్గు గనుల మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు.
ఈవీఎం(EVM)లపై మాజీ ముఖ్యమంత్రి జగన్(YS Jagan) అనుమానాలు వ్యక్తం చేయటం దుర్మార్గమని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (MLA Gorantla Butchaiah Chaudhary) అన్నారు. ప్రజలంతా తిరుగుబాటు చేసి ఆయన్ను ఓడించారని, కానీ జగన్ మాత్రం ఈవీఎం వల్లే తాను ఓడిపోయానని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
రాష్ట్రంలో నాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే అంతకుముందున్న ప్రభుత్వ పథకాల పేర్లను తీసేసింది.
తాజా మాజీ సీఎం జగన్.. రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ను ఎలా విని యోగించుకోవాలనే విషయంపై అ న్ని కోణాల్లోనూ ఆలోచన చేస్తామ ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడింది! కానీ... చాలా శాఖల్లో పాత అధికారులే కొనసాగుతున్నారు! కొందరిపైనే దృష్టి సారించి, మార్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా చాలామంది వివాదాస్పద, వైసీపీ అనుకూల అధికారులను ప్రస్తుతానికి అలాగే వదిలేశారు.
ఈవీఎంలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ (Minister Nara Lokesh) కౌంటర్ ఇచ్చారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు గెలిస్తే ఈవీఎం(EVM)లు బాగా పని చేసినట్లు, 2024లో ఓడిపోతే ఈవీఎంలపై నింద మోపుతావా? అంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు.