Home » Kotamreddy Sridhar Reddy
నెల్లూరులో మార్చి నెల 2వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉండనుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వీపీఆర్ కన్వెన్షన్లో ఏర్పాట్లని టీడీపీ నేతలు పరిశీలించారు. మార్చి 2వ తేదీన నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తారన్నారు.
ఆటో డ్రైవర్లు, యజమానులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆత్మీయ సమావేశం జరగనుంది. సీఎం జగన్ ప్రభుత్వంపై ఆటో డ్రైవర్లు, యజమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విపరీతంగా జరిమానాలు విధిస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతోంది. నేతలే కాదు.. వైసీపీ నుంచి టీడీపీలోకి నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుతున్నారు. నెల్లూరులో ఒకే సారి వైసీపీని వీడి వందలాది మంది నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఇవాళ సాయంత్రం వందలాది మంది టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవాళ స్పీకర్ ముందుకు వ్యక్తిగతంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. వ్యక్తిగతంగా స్పీకర్కు వివరణ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాతపూర్వకంగా తమ వివరణను ఆనం రానారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఈ నెల 5న సమర్పించారు.
ఇటీవలి కాలంలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అయితే పార్టీ తుడిచిపెట్టుకు పోయే పరిస్థితి వచ్చేసింది...
Andhrapradeshh: అనర్హత పిటిషన్లపై విచారణకు హాజరుకావాలంటూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యే అంశంపై వైసీపీ ఎమ్మెల్యేలు పలు దఫాలుగా చర్చలు నిర్వహించి చివరకు విచారణకు వెళ్లాలని నిర్ణయించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడలేదని ఎమ్యెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి స్పష్టంచేశారు.
ఏపీలో రూ.వేల కోట్ల ఇసుక దోచేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. అనుమతిలేని రీచ్లలో తవ్వకాలు సాగిస్తూ ఒక్కో వాహనం నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు.
Andhrapradesh: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని ఇసుక రీచ్లో అనధికారికంగా ధరలు భారీగా పెరిగాయి. ప్రతీ టిప్పుకు ట్రాక్టర్కు రూ.500లు, టిప్పర్కు రూ.2 వేలు చెల్లించాలని నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు.
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డితో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుధీర్ఘ చర్చలు నిర్వహించారు.