Home » Mancherial
అత్యవసర చికిత్సకు మంచిర్యాల జిల్లా కేంద్రం అందుబాటులో ఉంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్తోపాటు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి వైద్యం కోసం వస్తుంటారు. దీంతో వ్యాపారుల చూపు వైద్య రంగంపై పడింది. మల్టీస్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ పేర్లతో ప్రైవేటు ఆసుపత్రులు వెలుస్తున్నాయి. వైద్య పరంగా ఎలాంటి అనుభవం లేని వారు సైతం పెట్టుబడులు పెట్టి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా వానాకాలం వరి నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. సాగు పెట్టుబడి సాయం ఇంకా అందలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కార్ మూడు విడతల్లో రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసింది. వివిధ కారణాలతో చాలా మంది రుణాలు మాఫీ కాలేదు. ఓ వైపు రుణమాఫీ అందక, మరోవైపు కాంగ్రెస్ హామీ ఇచ్చిన మేరకు భోరసా అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ప్రగతి శీల మహిళ సంఘం (పీవోడబ్ల్యూ) రాష్ట్ర మహాసభల పోస్టర్లను గురువారం జిల్లా కేంద్రంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జ్యోతి విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ ఈనెల 31, సెప్టెంబరు 1, 2 తేదీల్లో హైద్రాబాద్లో మహాసభలు జరగను న్నాయని, వీటికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు.
మానవ జీవితంలో క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుం దని, క్రీడలతో శారీరకంగా మానసికంగా ధృఢం గా ఉంటారని కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. గురువారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్క రించుకుని కలెక్టరేట్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన ఉద్యోగులకు అదనపు కలెక్టర్ మోతి లాల్, జిల్లా యువజన క్రీడ శాఖ అధికారి కీర్తి రాజ్వీర్లతో కలిసి మెడల్స్ ప్రదానం చేశారు.
రైతులకు రుణాలు ఇచ్చినట్లుగా రికార్డుల్లో రాసేసి.. రైతుల ఖాతాల్లోంచి ఆ మొత్తాన్ని తామే స్వాహా చేసిన అధికారుల నిర్వాకం బట్టబయలైంది.
పత్తి పంట రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఆరుతడి పంటైన పత్తికి అడపదడప కురుస్తున్న వర్షాలతో కాలం కలిసివస్తోంది. అదనులో విత్తనాలు పడటంతో పత్తి పంట 70 నుంచి 90 రోజుల వయ సులో ఉంది. ఎలాంటి చీడపీడల బెడద లేకుండా ఏపుగా పెరుగుతూ గూడ కట్టి పూతకు వస్తోంది.
నేషనల్ హైవే 63 విస్తరణలో భాగంగా రూపొందించిన మూడో అలైన్మెంట్ను మార్చాలని లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల రైతు లు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రైతులకు రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులను కాల్చివేసి రెవెన్యూ అధికారుల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.
ఏజెన్సీ ప్రాంత సమస్యలను పరిష్కరించా లని, ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని మంగళవారం చేపట్టిన ఏజెన్సీ బంద్ పిలుపు మండలంలో విజయవంతమైంది. నాయకపోడ్ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ ప్రభుత్వం వలస లంబాడీలను ఎస్టీ జాబితాలో నుంచి వెంటనే తొలగించాలని, జీవో నెంబర్ 3ని కొనసాగించి ఐటీడీఏలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి ఉన్నతమైన జీవితం గడపాలని ఆశించిన ఓ యువకుడు అప్పులు చేసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు.
అక్కలతో రాఖీలు కట్టించుకోవాలని ఎంతో ఆశగా వచ్చిన చిన్నారికి గురుకుల పాఠశాల సిబ్బంది చుక్కలు చూపించారు.