Home » Mancherial
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరో గ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతోపాటు నాణ్యమైన విద్యాబోధన అందించి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేం ద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను ఆకస్మికంగా సందర్శించి రిజిష్టర్లు, వంటశాల, తర గతి గదులు, పరిసరాలను పరిశీలించారు.
గల్ఫ్ కార్మికుల సంక్షే మానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడాన్ని హర్షిస్తూ శుక్రవారం మండల కేంద్రంలో గల్ఫ్ కార్మి కుల సంక్షేమ సమితి నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి, ఖానాపూర్ ఎమ్మె ల్యే వెడ్మ బొజ్జుపటేల్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశా రు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్లో పని చేస్తున్న ఆరోగ్య మిత్రల సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం కలెక్టరేట్ ఎదుట తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నేత ఒకరు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అసైన్డ్ భూమిలో అక్రమంగా నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని మున్సిపల్ అధికారులు గురువారం కూల్చివేశారు.
రియల్టర్ల ధన దాహం ప్రజలకు శాపంగా మారుతోంది. రియల్టర్ల మాయాజాలంలో చిక్కుకుని నిలువునా మోసపోతున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా తమ అక్రమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న వ్యాపారులు అదును చూసి ప్రజల నెత్తిన కుచ్చుటోపీ పెడుతున్నారు. ఈ తతంగం జిల్లాలో నిత్యకృత్యంగా మారింది.
సమయం గురువారం ఉదయం ఆరు గంటలు... నస్పూర్ కలెక్టరేట్ రోడ్డులోని టీబీజీకేఎస్ మాజీ నేత డికొండ అన్నయ్య ఇంటికి రెవెన్యూ, పోలీసు సిబ్బంది చేరుకు న్నారు... ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేస్తామని, ఇళ్ళు ఖాళీ చేయాలని సూచించారు... కుటుంబ సభ్యులు కూల్చివేతను అడ్డుకోవడంతో అన్నయ్యతోపాటు కుటుంబసభ్యులను పోలీసులు స్టేషన్కు తరలించారు.
వానాకాలా నికి సంబంధించి ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయా లని కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. గురువారం కలె క్టరేట్లో రైసుమిలర్లు, అధికారులతో సమావేశం నిర్వ హించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బం దులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ కోసం పోరాడిన వీరుల త్యాగం చిరస్మరణీయమని, నాటి పోరాటాల ఫలి తంగా ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని, వీరయోధుల ను స్మరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ పేర్కొన్నారు. మంగళవారం ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జెండాను ఆవిష్క రించారు.
ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉపాధి హామీ పథకం 14వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికను మంగళవారం నిర్వహించారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు రూ. 6.49 కోట్లతో జరిగిన వివిధ పనులపై బృందాలు తనిఖీలు నిర్వహించారు.
ప్రభుత్వం ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు తలపెట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అద నపు కలెక్టర్ మోతిలాల్తో కలిసి సమావేశం నిర్వహిం చారు.