Home » Nalgonda News
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించేదిలేదని ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ( Minister Komati Reddy Venkat Reddy ) తీవ్రంగా హెచ్చరించారు. మంగళవారం నాడు నల్గొండలో ప్రజా పాలన సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు.
జిల్లా కేంద్రంలో దారుణం ఘటన జరిగింది. తిరుమలగిరి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన బొడ్డుపల్లి సాయి అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కాగా ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. తల, మొండెం వేరు చేసి నల్గొండలోని రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. రైల్వే పోలీసులు రహస్యంగా విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిర్వహించి గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని పోలీసులు తరలించారు.
అధికారులంతా స్థానిక ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి మిషన్ భగీరథ నీటి సరఫరా సమస్యలు పరిష్కరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ( Minister Komati Reddy Venkat Reddy ) తెలిపారు.
నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టులో చివరలో ఉండే మఠంపల్లి మండలంలో వ్యవసాయ సబ్మార్కెట్ అలంకారప్రాయంగా దర్శనమిస్తోంది.
‘ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ఈ నాలుగు రోజులు మాత్రమే ఆపగలుగుతారు.
జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్(Congress, BRS)ల మధ్య రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. తాజాగా నగరంలోని ఆర్జాల బావి వద్ద ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఇంటిపై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయి.
హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద విజయవాడ వైపు వెళ్తున్న కోదాడ ఆర్టీసీ డిపో బస్సు... మొక్కలకు నీళ్లు కొట్టే వాటర్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 20మందికి పైగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా (Nalgonda District)లో రెండో అతిపెద్ద జలాశయమైన మూసీ ప్రాజెక్ట్ (Moose project) జలకళ సంతరించుకుంది.
మండలంలోని వెంకట్రాంపురం గ్రామంలో ఉన్న దేవుడి మాన్యంపై అధికార పార్టీ నాయకుడి కన్ను పడింది. ఆక్రమించు కోవడానికి భూమిని చదును చేయిస్తుండగా గ్రామస్థులు ఇటీవల అడ్డుకున్నారు.