Home » Rain Alert
పిఠాపురం, ఆగస్టు 30: రోజంతా వర్షమే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలతో పా
బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనంతో ఇవాళ(శుక్రవారం) రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అతిభారీ, మోస్తరు వర్షాలు(Rains) కురిస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
గడిచిన మూడు, నాలుగు రోజులుగా భాగ్యనగరాన్ని వరణుడు వదలట్లేడు. సోమ, మంగళవారాల్లో హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా.. బుధవారం కూడా అదే పరిస్థితి నెలకొంది.
శ్రీశైలంలో ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షం దంచికొట్టింది. రాత్రి నుంచి ఉదయం వరకు ఎడతెరుపు లేకుండా భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి శ్రీశైలంలోని కొత్తపేటలో ఉన్న ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో స్థానికులు రాత్రంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీవర్షం కురిసింది. బెళుగుప్ప సమీపంలోని బ్రిడ్జిపై నీరు పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్లో ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. దీంతో జలమండలి అప్రమత్తమైంది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఈరోజు(మంగళవారం) ఉన్నతాధికారులు, జీఎం, డీజీఎం, మేనేజర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శని, ఆదివారాల్లో చాలాచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది.
రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తాయని హెచ్చరించింది.
తెలంగాణలో మరికొన్నిరోజులు మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. గురువారం నుంచి ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో తడిసి ముద్దయిన హైదరాబాద్ మహానగరంలో మరోసారి వాన మొదలైంది.