Home » sajjanar
దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల కోసం టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఎక్కవు దూరం ప్రయాణించే ప్రయాణీకులు 8రోజుల ముందుగానే అడ్వాన్స్ రిజర్వేజన్ చేసుకుంటే రిజర్వేషన్ ఫీజుఉండదని ప్రకటించింది. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ పోస్టులో తెలిపారు. రిజర్వేషన్ ఫీజు తీసుకోకపోవడం వల్ల ప్రయాణీకుడికి కొంత సొమ్ము ఆదా కానుంది. వాస్తవానికి దూరప్రాంతాలకు ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో వెళ్లాలనుకుంటే ముందుగానే రిజర్వేషన్లు చేసుకుంటారు. దీనికోసం రిజర్వేషన్ ఛార్జీలు వసూలు చేస్తారు.
Telangana: రాష్ట్రంలో టీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చేశాయి. మంగళవారం నాడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... గతంలో ఆర్టీసీ సిబ్బంది జీతాల కోసం ఇబ్బంది పడేవారని.. ఆర్టీసీ ఆస్తులను కోల్పోతుందనే ఆందోళన ఉండేదన్నారు. ఆర్టీసీ కార్మికులకు భావ ప్రకటన స్వేచ్చ ఉండేది కాదన్నారు.
Telangana: తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇటీవల జరిగిన ఓ పోటీ పరీక్షల్లో ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ఎకౌంట్లో పోస్ట్ చేస్తూ ‘‘మీ మెదడుకు పదను పెట్టండి’’ అంటూ నెటిజన్లకు ప్రశ్న సంధించారు.
Telangana: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమక్క-సారక్కా జాతర ఈరోజు నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ విషయంపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. మేడారం జాతరకు ఆర్టీసీ 6000 ప్రత్యేక బస్సులు నడుపుతోందన్నారు.
మేడారం మహాజాతరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మేడారం మహాజాతరపై ఆర్టీసీ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) హాజరయ్యారు.
వాహన ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తాయో చెప్పలేం. అయితే అప్రమత్తంగా ఉంటే కొంతమేరకు ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అలాంటి సందేశాన్ని ఇచ్చే ఓ వీడియోను షేర్ చేశారు. కారు డోర్ తెరిచేటప్పుడు అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు ఎంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరించే వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. సురక్షితం - శుభప్రదం అనే మాటలు కేవలం రాతలకు పరిమితమవుతున్నాయి. ప్రయాణీకుల భద్రతే లక్ష్యంగా సేవలందిస్తోన్న ఆర్టీసీ సిబ్బందికే రక్షణ లేకుండా పోతోంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా అదనపు బస్సులను పెంచినట్లు TSRTC ఎండీ సజ్జనార్ వెల్లడించారు. దీంతోపాటు ఆర్టీసీ నిన్న ఒక్కరోజు 52 లక్షల మందికిపైగా ప్రయాణికులను స్వస్థలాలకు చేరవేసినట్లు తెలిపింది.
Telangana: సంక్రాంతి పండుగ కోసం 4484 బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచామని టీఎస్సార్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బుధవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ఆర్టీసీ ఎండీ మాట్లాడుతూ.. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రయాణికులను సేఫ్ గా గమ్య స్థానాలకు చేర్చే ఆర్టీసీ డ్రైవర్లకే భద్రత లేకుండా పోతోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన