Home » sajjanar
తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. మహిళా ప్రయాణికులకు కీలక సూచనలు చేశారు. 'మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం' వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి అని స్పష్టం చేశారు ఆర్టీసీ ఎండీ.
మియాపూర్ డిపో 2లో ఘనంగా వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ( Sajjanar ) హాజరయ్యారు. అనంతరం విధి నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ వేణుగోపాల్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ....టీఎస్ ఆర్టీసీలో వనభోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఉద్యోగులంతా స్నేహపూర్వక వాతావరణంలో కలిసి వనభోజనాలు కార్యక్రమం చేసుకోవడం మంచి పరిణామమని సజ్జనార్ చెప్పారు.
బస్ భవన్లో అద్దె బస్సు ఓనర్లతో సమావేశం ముగిసింది. అద్దె బస్సు ఓనర్ల తో చర్చలు సఫలమయ్యాయి. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లు కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు.
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంటుంది. గ్రేటర్ హైదరాబాద్లో జారీ చేసే ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ పోస్ట్ పెట్టారు.
Telangana: ప్రభుత్వం తీసుకువచ్చిన మహాలక్ష్మీ పథకానికి మంచి రెస్పాన్స్ వస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. నగరంలోని ఎన్టీఆర్ మార్గ్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద 80 కొత్త బస్సుల ప్రారంభ కార్యక్రమంలో సజ్జనార్ పాల్గొన్నారు.
Pallavi Prashanth: బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ విజేత పల్లవి ప్రశాంత్పై హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసునమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఆరు గ్యారంటీల్లో ఒకటైన ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకాన్ని శనివారం ప్రారంభించనుంది.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో ఒకటైన బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలైతే.. టీఎస్ ఆర్టీసీకి ఏటా రూ.3 వేల కోట్ల మేర అదనపు భారం పడుతుందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) బాలాజీ దర్శన్ (Bajali darshan) టికెట్లకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఏడు నెలల్లో 77,200 మంది భక్తులు ఈ టికెట్లను బుక్ చేసుకుని.. క్షేమంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (RTC MD Sajjanar) కీలక వ్యాఖ్యలు చేశారు. క్యూనెట్ (Qnet) సంస్థపై గతంలో అనేక కేసులున్నాయన్నారు...