Home » Singanamala
అభివృద్ధే ధ్యేయంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి టీడీపీ పాలనలోనే సాధ్యమన్నారు. బుధవారం మండల పరిధిలోని రేకలకుంట గ్రామంలో పల్లె పండగ కింద నిర్మించిన సీసీ రోడ్డును ఆమె ప్రారంభించారు.
నియోజకవర్గ కేంద్రమైన శింగనమల ఆర్టీసీ బస్టాండ్ అవరణంలోకి గత 15 ఏళ్లగా బస్సులు వచ్చి న దాఖలాలు లేవు. ప్రయాణికు లు బస్సు ఎక్కాలంటే పక్క ఉన్న రోడ్డు కు వెళ్లాల్సిందే. దీంతో బస్టాండ్ శిథిలావస్థకు చేరుతోంది. ఈ సమ యంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ చొరవవతో పది రోజుల నుంచి బస్సులను ఆర్టీసీ బస్టాండ్ తీసుకెళ్తున్నారు. ప్రయాణికులు బస్టాండ్ అవ రణంలో బస్సు ఎక్కుతున్నారు.
కోరిన కోర్కెలు తీర్చే భక్తుల ఇల వేల్పుగా విరాజిల్లు తున్న గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వా మికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రఽధాన ఆర్చకులు రామాచార్యులు వేకువ జామున స్వామివారికి వివిధ అభి షేకాలు చేసి, ప్రత్యేక ఆలంకరణ చేశారు.
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పాల న సాగిస్తోందని ఎమ్మె ల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. గార్లదిన్నెలోని రైతు సేవా కేందల్రో చీనీ ప్రోసెసింగ్ యూనిట్ ఏర్పాటుపై గురువారం ఉద్యానవన రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, ఏపీ ఫుడ్ సోసైటీ అధికారి శేఖర్బాబు ముఖ్య అతిథులుగా హాజరై రైతులతో చర్చించారు.
మండల కేంద్రంలోని ఓ విద్యుత స్తంభానికి బల్బు అమరుస్తుండగా... ఉన్నట్టుండి ఆ స్తంభం ఓ పక్కకు ఒరిగిపోయిం. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు. శింగనమల చిన్నకాలువ వీధిలో బుధవారం సాయం త్రం విద్యుత స్తం భాలకు బల్బులు అమరుస్తున్నారు.
పేదవాడి సొంతింటి కలను ని జం చేస్తామంటూ గత వైసీపీ ప్రభుత్వం ఏకంగా కాలనీలనే ఏర్పాటు కు పూనుకుంది. అయితే మండలంలో ఏ ఒక్కరికీ ఇల్లు మంజూరు చే య లేదు. అంతేకాకుండా ఒక్కొక్కరికి ఒకటిన్నర సెంటు స్థలం మాత్రం మంజూరు చేయడం, అనువుగానిచోట స్థలాలు ఇవ్వడంతో చాలా మంది ఇళ్ల నిర్మాణానికి అసక్తి చూపలేదు.
నియోజకవర్గ కేంద్రం సమీపం లోని మరవకొమ్మ వద్ద బస్టాప్ ఏర్పాటు చేయిస్తాని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తెలిపారు. రోడ్డు పనులు జరిగిప్పటి నుంచి అక్కడ బస్సులు నిలపకపోవడంతో చాలా గ్రామాల ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని అన్నారు. ఆమె మంగళవారం నేషినల్ హైవే అధికారులతో కలసి శింగనమల మరవకొమ్మ వద్ద జరుగుతున్న ఎనహెచ 544డి జాతీయ రహదారుల పనులను పరిశీలించారు.
నియోజకవర్గం కేంద్రమైన శింగనమలలో తహసీ ల్దార్ కార్యాలయాన్ని సిబ్బంది కొరత పీడిస్తోంది. దీంతో ప్రజ సమస్యల పరిష్కారం జఠిలంగా మారిందని ప్రజలు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో కీలకమైన ఆర్ఐ లేక పోవడం తో సర్టిఫికెట్ల జారీలో అలస్యం అవుతున్నట్లు ప్రజల నుంచి ఆరోపణలు వినిసిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభి వృద్ధిపై ప్రత్యేక దృష్టితో ముందుకెళుతోందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. ఎమ్మెల్యే శనివారం శింగనమలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథ కాన్ని ప్రారంభించా రు. విద్యార్థులతో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియన కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు చాలామంది అర్ధాకలితో చదువులు కొనసాగిస్తున్నారని అన్నారు.
మండలంలోని బండ్లపల్లిలో జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న రోడ్డుపై ప్రమాదకరంగా విద్యుతతీగలను ఏ ర్పాటు చేశారు. వాటిని రోడ్డుమీదే అడ్డంగా తీసుకెళ్లడంతో.. ఏ మాత్రం ఆదమరిచినా వారు ప్రాణాలు గాలిలో కలవాల్సిందే. ఈ దారి పక్క నే ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో 300 మంది విద్యార్థులు చదువుకుం టు న్నారు. అంతేకాకుండా ఆ పరిసర ప్రాంతంలో సచివాలయం, హెల్త్ సెం టర్ ఉన్నాయి.