Home » Singanamala
పరిశుభ్రమైన వాతవర ణం గ్రామాల అభివృద్ధికి తోర్పడుతుందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. నియోజకవర్గం కేంద్రమైన శింగనమలలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించా రు.
మండల కేంద్రమైన నార్పల క్రాసింగ్ వద్ద 18 ఎకరాల విస్తీర్ణంలో ఈనెల 18, 19 తేదీలలో జరిగే ఇజ్తమా ఏర్పాట్లను గురువారం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమెతో ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ... 12 సంవత్స రాల తరువాత నార్పలలో ఇజ్తమా ఏర్పాటు చేశామని, ఇందులో 25వేల 30వేల మంది పాల్గొంటారని వారు తెలిపారు.
అభివృద్ధే ధ్యేయంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి టీడీపీ పాలనలోనే సాధ్యమన్నారు. బుధవారం మండల పరిధిలోని రేకలకుంట గ్రామంలో పల్లె పండగ కింద నిర్మించిన సీసీ రోడ్డును ఆమె ప్రారంభించారు.
నియోజకవర్గ కేంద్రమైన శింగనమల ఆర్టీసీ బస్టాండ్ అవరణంలోకి గత 15 ఏళ్లగా బస్సులు వచ్చి న దాఖలాలు లేవు. ప్రయాణికు లు బస్సు ఎక్కాలంటే పక్క ఉన్న రోడ్డు కు వెళ్లాల్సిందే. దీంతో బస్టాండ్ శిథిలావస్థకు చేరుతోంది. ఈ సమ యంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ చొరవవతో పది రోజుల నుంచి బస్సులను ఆర్టీసీ బస్టాండ్ తీసుకెళ్తున్నారు. ప్రయాణికులు బస్టాండ్ అవ రణంలో బస్సు ఎక్కుతున్నారు.
కోరిన కోర్కెలు తీర్చే భక్తుల ఇల వేల్పుగా విరాజిల్లు తున్న గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వా మికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రఽధాన ఆర్చకులు రామాచార్యులు వేకువ జామున స్వామివారికి వివిధ అభి షేకాలు చేసి, ప్రత్యేక ఆలంకరణ చేశారు.
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పాల న సాగిస్తోందని ఎమ్మె ల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. గార్లదిన్నెలోని రైతు సేవా కేందల్రో చీనీ ప్రోసెసింగ్ యూనిట్ ఏర్పాటుపై గురువారం ఉద్యానవన రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, ఏపీ ఫుడ్ సోసైటీ అధికారి శేఖర్బాబు ముఖ్య అతిథులుగా హాజరై రైతులతో చర్చించారు.
మండల కేంద్రంలోని ఓ విద్యుత స్తంభానికి బల్బు అమరుస్తుండగా... ఉన్నట్టుండి ఆ స్తంభం ఓ పక్కకు ఒరిగిపోయిం. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు. శింగనమల చిన్నకాలువ వీధిలో బుధవారం సాయం త్రం విద్యుత స్తం భాలకు బల్బులు అమరుస్తున్నారు.
పేదవాడి సొంతింటి కలను ని జం చేస్తామంటూ గత వైసీపీ ప్రభుత్వం ఏకంగా కాలనీలనే ఏర్పాటు కు పూనుకుంది. అయితే మండలంలో ఏ ఒక్కరికీ ఇల్లు మంజూరు చే య లేదు. అంతేకాకుండా ఒక్కొక్కరికి ఒకటిన్నర సెంటు స్థలం మాత్రం మంజూరు చేయడం, అనువుగానిచోట స్థలాలు ఇవ్వడంతో చాలా మంది ఇళ్ల నిర్మాణానికి అసక్తి చూపలేదు.
నియోజకవర్గ కేంద్రం సమీపం లోని మరవకొమ్మ వద్ద బస్టాప్ ఏర్పాటు చేయిస్తాని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తెలిపారు. రోడ్డు పనులు జరిగిప్పటి నుంచి అక్కడ బస్సులు నిలపకపోవడంతో చాలా గ్రామాల ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని అన్నారు. ఆమె మంగళవారం నేషినల్ హైవే అధికారులతో కలసి శింగనమల మరవకొమ్మ వద్ద జరుగుతున్న ఎనహెచ 544డి జాతీయ రహదారుల పనులను పరిశీలించారు.
నియోజకవర్గం కేంద్రమైన శింగనమలలో తహసీ ల్దార్ కార్యాలయాన్ని సిబ్బంది కొరత పీడిస్తోంది. దీంతో ప్రజ సమస్యల పరిష్కారం జఠిలంగా మారిందని ప్రజలు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో కీలకమైన ఆర్ఐ లేక పోవడం తో సర్టిఫికెట్ల జారీలో అలస్యం అవుతున్నట్లు ప్రజల నుంచి ఆరోపణలు వినిసిస్తున్నాయి.