Home » Srikalahasti
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) ఎన్నికల ప్రచారంతో హీటెక్కిస్తున్నారు. శ్రీకాళహస్తిలో చేపట్టిన ప్రచారంలో నిర్వహించిన సభలో స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పై ఫైర్ అయ్యారు.
Andhrapradesh: శ్రీకాళహస్తిలో జనసేన, టీడీపీ మధ్య టపాసుల రగడ చిచ్చుపెట్టింది. శ్రీకాళహస్తికి బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ ఖరారు చేయడంతో నిన్న (గురువారం) రాత్రి శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ నగరం వినుత ఇంటిముందు టీడీపీ నాయకులు బాణాసంచా కాల్చారు. అయితే రెచ్చగొట్టేలా వ్యవహరించిన టీడీపీ నేతల తీరుపై జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంపై డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. కొందరు వ్యక్తులు డ్రోన్ సహాయంలో ఆలయానికి సంబంధించి వీడియోలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తమిళనాడుకు చెందిన ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంపై డ్రోన్ ఎగిరిన ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం అర్ధరాత్రి డ్రోన్తో వీడియోల చిత్రీకరణ నిర్వహించినట్టు సమాచారం. పోలీసుల అదుపులో ఐదుగురు తమిళనాడుకు చెందిన యువకులున్నట్టు తెలుస్తోంది.
శ్రీకాళహస్తి(Srikalahasti) ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తిరుపతి కలెక్టర్ లక్ష్మీషా(Collector Lakshmi Shah) వ్యాఖ్యానించారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ లక్ష్మీషా , ఎస్పీ మల్లికాగార్గ్ గురువారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు.
తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి ఆలయంలో మరో అపచారం జరిగింది. రావణాసురుడికి ఎన్ని తలలు ఉంటాయో కూడా తెలియకుండా అధికారులు కొత్తగా రావణాసురుడి వాహనం సిద్ధం చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో నవకంఠ రావణాసురుడిని బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేశారు.
శ్రీకాళహస్తిలో వైసీపీ బరితెగింపు చర్చనీయాంశంగా మారింది. పంచాయతీరాజ్ అతిథి గృహంలో ప్రభుత్వ వలంటీర్లకు వైసీపీ నేతలతో రాజకీయ పాఠాలు చెప్పిస్తోంది. శ్రీకాళహస్తి పట్టణంలోని సినిమా వీధి, దోబీ ఘాట్, పెద్ద మసీదు వీధి, ఎం.ఎం వాడా, తెలుగుగంగ కాలనీ, జయరాం రావు వీధులకు చెందిన తొమ్మిది మంది వలంటీర్లకు శిక్షణ ఇప్పిస్తోంది.
తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బొజ్జల సుధీర్ రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐ అజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు మరో 26 మందిపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
శ్రీకాళహస్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాళహస్తిలో రోడ్ షో నిర్వహించి, బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇంకోవైపు అడుగడుగునా అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. టీడీపీ ఫ్లెక్సీలు కొన్నింటిని తొలగించారు. మరికొన్ని ఫ్లెక్సీల్లో సైకో పోవాలి అనే పదానికి అధికారులు రంగులు వేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనను వైసీపీ రణరంగంగా మార్చేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై చంద్రబాబు యుద్ధభేరి పేరుతో విస్తృత పర్యటన సాగిస్తున్నారు. అయితే.. చిత్తూరు జిల్లా పర్యటనలో అంగళ్లు, పుంగనూరులో వైసీపీ నేతలు రెచ్చిపోయి.. రణరంగంగా మార్చారు!. చంద్రబాబు కాన్వాయ్పై రాళ్ల దాడి, టీడీపీ వాహనాలను ధ్వంసం చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.