Home » TDP
పంచాయతీల నిధులను దారిమళ్లించిన గజ దొంగ వైఎస్ జగన అని, వైసీపీ పాలనలో పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయని ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు. ముత్తవకుంట్ల గ్రామంలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు.
పల్నాడు జిల్లాలోని మాచర్ల మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. 16 మంది వైసీపీ కౌన్సిలర్లు శుక్రవారం టీడీపీలో చేరారు. మాచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పోలూరు నరసింహారావు నిన్న అంటే గురువారం టీడీపీలో చేరారు. దీంతో మాచర్ల మున్సిపల్ చైర్మన్గా పోలూరు నరసింహారావును ఈ రోజు కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Andhrapradesh: జగన్... నీరో చక్రవర్తిలా ఇంట్లో కూర్చుని పబ్జీ గేమ్లు ఆడుతూ ఐదేళ్లు నెట్టుకొచ్చేశారిన రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని, వ్యవస్థలను విధ్వంసం చేసిన ఘనత జగన్ దే అని అన్నారు. గత ఏడాది ఇచ్చిన థర్డ్ పార్టీ నివేదిక అమలు చేయకపోవడం వల్లే...
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం త్వరలోనే కొత్త అందాన్ని సంతరించుకోబోతోంది. జంగిల్ క్లియరెన్స్తో రూపురేకలు మారుతున్నాయి. కంప తొలగింపు పనులు దాదాపు 40 శాతం వరకు పూర్తి అయ్యాయి. గత ఐదేళ్లలో దట్టంగా పెరిగిన.. ముళ్లకంపలతో నిండిపోయి ఉన్న అమరావతి ప్రాంతం త్వరలోనే పూర్వకళ సంతరించుకోబోతోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) శుక్రవారం అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో(Ambedkar Konaseema Dist) పర్యటించనున్నారు.
ఉచిత ఇసుక కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇసుక కోసం వినియోగదారులు ఇబ్బంది పడొద్దని అభిప్రాయ పడింది. ఉచిత ఇసుక సరఫరా అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అధికారులతో సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అడుగడుగునా అడ్డుకోవాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారని మాజీమంత్రి జవహర్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై బురద జల్లాలని ఆ పార్టీ నేతలు విశ్వప్రయత్నాలు చేశారని విమర్శించారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతలకు అసలు విషయం తెలిసొచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించిన నేతలు ప్రస్తుతం స్వరం మార్చారు.
ఎన్నికల ముందు మాదే అధికారం అంటూ అత్యుత్సాహం ప్రదర్శించిన వైసీపీ నాయకుల ఆచూకీ కనబడటం లేదట. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందనే చర్చ జరుగుతోంది. కనీసం కార్యకర్తలకు సైతం అందుబాటులో లేరట.
Andhrapradesh: పంచాయతీల అభివృద్ధి కోసం సర్పంచ్ల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 988 కోట్లు జమచేయడంపై పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హెఆర్డీ మంత్రి లోకేష్కు చాంబర్ తరపున అభినందనలు తెలియజేశారు.