Home » TG Govt
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అధిక వడ్డీతో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రుణాలు తీసుకున్నారని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) విమర్శించారు.
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే బడ్జెట్పై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు స్పందించారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు.
తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమాధానం చెప్పలేక కాంగ్రెస్ ప్రభుత్వం సభను వాయిదా వేసి పారిపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్ రావు అన్నారు.
‘‘తెలంగాణ ప్రయోజనాల కోసమే పుట్టామని చెప్పుకొనే బీఆర్ఎస్ కేంద్రం వివక్షపై గట్టిగా మాట్లాడుతుందని ఆశించాం. కానీ, వారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని తేలింది.
సింగరేణిలో పనిచేస్తూ హెచ్డీఎ్ఫసీ బ్యాంకులో వేతన ఖాతా కలిగిన ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగికి రూ.30 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం వర్తించనుందని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్ పేర్కొన్నారు.
‘గ్రాండ్ హెల్త్ చాలెంజ్’లో భాగంగా ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
ప్రతి మండలానికి మూడు చొప్పున.. సగటున పదేసి ఊళ్లకు ఒక రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. 15 నుంచి 20 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ, ఈడీ కేసులకు సంబంధించి దాఖలైన డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ చేపట్టాలని నాంపల్లి సీబీఐ కోర్టును తెలంగాణహైకోర్టు మరోసారి ఆదేశించింది.
రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడంలో కేంద్రంపై పోరాటం చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) తెలిపారు. రాజకీయ కోణంలో రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని కోరారు. ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం వెనక్కిపోదన్నారు.