Home » Vizag News
ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయినా వైసీపీ పద్ధతి మారలేదు. విషప్రచారం చేయడం మానుకోలేదు. కొత్త ప్రభుత్వంపైన, విశాఖపట్నంలో ఐటీ రంగంపైన విషం చిమ్ముతోంది.
గత ఐదేళ్లు వైసీపీ నేతలు రాష్ట్రంలో అరాయకం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మారిన కూడా కొంతమంది వైసీపీ నాయకుల్లో మార్పు రావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులపై బెదిరింపులకు దిగుతున్నారు.
క్రీడల్లో రాజకీయ ప్రమేయం ఇకపై ఉండదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Minister Ramprasad Reddy) స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3 ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విచ్చేశారు.
ఏయూలో చాలా అక్రమాలు, అన్యాయాలు జరిగాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) తెలిపారు. ప్రసాద్ రెడ్డి రాజీనామా చేసిన వదిలేది లేదని, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు (MVV Satyanarayana) ఏపీ హైకోర్టులో(AP High Court) ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు తెలిపింది.
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ పైన, గత వైసీపీ ప్రభుత్వ పెద్దలకు కన్ను పడిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) తెలిపారు. విశాఖలో వ్యాపారాల పైన గత వైసీపీ ప్రభుత్వం దృష్టిపడిందన్నారు. సినిమాల్లో సంబంధం లేని వాళ్లు కూడా ఈ క్లబ్లో రాజకీయంగా ఇందులో చొరబడ్డారని ఆరోపించారు.
ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రేపు(బుధవారం) సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈరోజు సెక్రటేరియట్కు వెళ్లిన పవన్ తన చాంబర్ను చూడటం, సంబంధిత శాఖ ఉన్నతాధికారులను పరిచయం చేసుకున్నారు.
గంజాయి నిర్మూలనకు విశాఖ పోలీస్ అధికారులు వందరోజుల ప్రణాళిక సిద్ధం చేశారు. ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ఆదేశాలతో, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులతో విశాఖ జిల్లా పోలీసులు గంజాయి రవాణాపై అలెర్ట్ అయ్యారు.
స్టీల్ ప్లాంట్ను పరిరక్షించే బాధ్యత పూర్తిగా తాను తీసుకుంటానని ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ (Palla Srinivasa Rao) తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కూర్మం పాలెం వద్ద చేపట్టిన దీక్ష1223 రోజులకు చేరుకుంది.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వాన్ని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ (Peethala Murthy Yadav) డిమాండ్ చేశారు. 2008లో ఏసీఏలో అక్రమాలకు పాల్పడినట్లు ఏపీ హైకోర్టులో కేస్ విచారణలో ఉందని అన్నారు.