Home » Videos
ప్రపంచంలో తెలుగువారు విశేషంగా అభిమానించి.. ఆదరించే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెబ్ సైట్కు ప్రజాధరణ ఉంది. వెబ్సైట్కు ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాఫిక్ను తనవైపుకు మళ్లించేందుకు.. వెబ్ సైట్కు వచ్చే ఆదాయాన్ని గండికొట్టేందుకు సాక్షి ప్రయత్నం చేసింది.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో పని చేసే అవుట్ సో ర్సింగ్ ఉద్యోగి ఒక అనాథ మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా మాయం చేసేందుకు ప్రయత్నం చేశాడు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని పలువురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. నిడదవోలు సర్కిల్ పెరవలి పరిధిలో పోలీసు ఉన్నతాధికారులతోపాటు సిబ్బంది పేకాట కేసులో చేతి వాటం చూపించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వారిపై శాఖపరమైన విచారణ జరిగింది.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆత్మబంధువు, విశాఖపట్నం శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి చంద్రబాబు ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. గత ప్రభుత్వం విశాఖపట్నంలో సదరు పీఠానికి 15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.
పులివెందుల ఎమ్మెల్యే, మాజీ సీఎం వైఎస్ జగన్.. బుధవారం విలేకర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు మూస ధోరణిలోనే ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండగానే కాదు.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సైతం నాటి ప్రతిపక్షాలపై దోచుకో.. పంచుకో.. తినుకో.. అంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలే మళ్లీ మళ్లీ చేస్తున్నారనే చర్చ జరుగుతుంది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీసీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియా ముందుకు వచ్చి.. కూటమి పాలనపై విమర్శలు గుప్పించారు. దీనిపై ఏపీ బీజేపీ సీనియర్ నేత భాను ప్రకాశ్ రెడ్డి శుక్రవారం స్పందించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై వీరు చేస్తున్న విమర్శలు.. వారి పాలనలో చోటు చేసుకున్నాయని ఆయన గుర్తు చేశారు.
సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట ప్రకాశ్నగర్లో 700 కిలోల కుళ్లిన చికెన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: నగరంలో యజమానికి తెలియకుండానే ఓ ఇంటిని అమ్మేసారు. దీనిపై మియాపూర్లో ట్రెస్ పాస్, చీటింగ్ కేసు నమోదైంది. దండు లచ్చి రాజు అనే వ్యక్తికి చెందిన ప్రాపర్టీలోకి అక్రమంగా వచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అమరావతి: వైసీపీ హయాంలో భూఆక్రమణలు, దోపిడీలకు అడ్డాగా మారడంతో విశాఖలో పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడ్డారు. రాజధాని పేరుతో రచ్చ చేశారు గానీ.. అభివృద్ధి మాత్రం చేయలేదు. కూటమి సర్కార్ రావడం.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో విశాఖకు మహర్దశ వచ్చింది.
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను వాట్సాప్లో దుండగులు బెదిరించారు. ముంబై ట్రాఫిక్ పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ మెసేజ్ చేశారు. రూ. 5 కోట్లు ఇవ్వకుంటే సల్మాన్ను చంపేస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ కంటే దారుణంగా చంపుతామని వార్నింగ్ ఇచ్చారు.