Share News

Purandeshwari: కరువు విలయతాండవం జగన్‌కు కనింపించడం లేదా?

ABN , First Publish Date - 2023-11-07T10:04:46+05:30 IST

జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు కనిపించడం లేదని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి విమర్శలు గుప్పించారు.

Purandeshwari: కరువు విలయతాండవం జగన్‌కు కనింపించడం లేదా?

అనంతపురం: జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు (CM Jagan) కనిపించడం లేదని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి (AP BJP Chief Purandeshwari) విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రైతులకు అనే హామీలు ఇచ్చారని... ఇవాళ బటన్లు నొక్కుతూ రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా 3 లక్షల 45 వేల ఎకరాలకు సాగు, తాగు నీరు అందిస్తామని ఎన్నికల్లో చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. ఇవాళ కుప్పం, పుంగనూరు ప్రాంతాలకు నీటిని తరలించే ప్రయత్నం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandrareddy) చేస్తున్నాడని తెలిసిందన్నారు. శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని ఎక్కడ ఆ దిశగా అడుగులు పడిన చర్యలు లేవన్నారు. బటన్ నొక్కి 12,500 ఇస్తానని చెప్పిన జగన్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో కలిసి పెద్దిరెడ్డి కలిపి ఇవ్వడం నిజం కాదా అని నిలదీశారు. బటన్ నొక్కుతూ ప్రజల్ని రైతులని మోసం చేస్తున్నారు అంటూ పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-07T10:04:47+05:30 IST