LokeshYuvaGalam: లోకేష్ పాదయాత్రకు బ్రేక్ వేసేందుకు ఏం చేశారో చూడండి....

ABN , First Publish Date - 2023-02-02T15:11:30+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతున్న వేళ పోలీసులు అడ్డంకులు సృష్టించేందుకు యత్నించారు.

LokeshYuvaGalam: లోకేష్ పాదయాత్రకు బ్రేక్ వేసేందుకు ఏం చేశారో చూడండి....

చిత్తూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (NaraLokesh YuvaGalam Padayatra) యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతున్న వేళ పోలీసులు (Police) అడ్డంకులు సృష్టించేందుకు యత్నించారు. పలమనేరు నియోజవర్గంలో లోకేష్ పాదయాత్ర (YuvaGalam)ను పోలీసులు అడ్డుకున్నారు. లోకేష్ (YuvaGalamPadayatra) కాన్వాయ్‌లోని ప్రచార వాహనాన్ని సీజ్ (Campaign vehicle siege) చేశారు. దీంతో పలమనేరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనుమతి లేకుండా వాహనాన్ని ఉపయోగించారని పలమనేరు డీఎస్పీ చెప్పుకొచ్చారు. అయితే తమ వాహనాన్ని అడ్డుకోవడంపై టీడీపీ నేతలు (TDP Leaders)నిరసనకు దిగారు. ఎందుకు వాహనాన్ని సీజ్ చేస్తున్నారంటూ పోలీసులు తీరుపై తెలుగు దేశం శ్రేణులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రచార వాహనం ముందు బైఠాయించి టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Updated Date - 2023-02-02T15:12:32+05:30 IST