Share News

TDP Vs YSRCP : చంద్రబాబు, భువనేశ్వరిపై నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-10-18T10:44:46+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరోసారి వివాదాస్పదమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన మృతికి కారకులైన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. చంద్రబాబు నాయుడిని చంపేసి లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్న కుటుంబం నారావారిది అంటూ వ్యాఖ్యలు చేశారు.

TDP Vs YSRCP : చంద్రబాబు, భువనేశ్వరిపై నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు

చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై (TDP Chief Chandrababu naidu) డిప్యూటీ సీఎం నారాయణస్వామి (Deputy CM Narayanaswamy) మరోసారి వివాదాస్పదమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను (NTR) వెన్నుపోటు పొడిచి ఆయన మృతికి కారకులైన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. చంద్రబాబు నాయుడిని చంపేసి లోకేష్‌ను (TDP Leader Nara Lokesh) ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్న కుటుంబం నారావారిది అంటూ వ్యాఖ్యలు చేశారు. భువనేశ్వరి (Bhuvaneshwari), పురందేశ్వరి (Purandeshwari)ఇద్దరు కూడా ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలే... కాబట్టి ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్న కసి ఆ కుటుంబంలో ఉండవచ్చన్నారు. అందుకే ఇప్పుడు జైల్లో ఉన్న చంద్రబాబును చంపేసి నారా లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్నారని డిప్యూటీ సీఎం అన్నారు.


చంద్రబాబు నాయుడు తప్పు చేసి జైలుకు వెళ్లారన్నారు. ఎలాంటి తప్పు చేయని జగన్మోహన్ రెడ్డిని అప్పట్లో సోనియాగాంధీ, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కలిసి జైలుకు పంపించారని మండిపడ్డారు. లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఎందరో వ్యక్తులు జైలుకు వెళ్ళినప్పుడు ఉద్యమాలు, ఆందోళనలు జరగలేదని చెప్పుకొచ్చారు. కానీ చంద్రబాబు నాయుడును అక్రమంగా జైలుకు తరలించారంటూ కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు చేస్తున్న ఆందోళనలు సమంజసంగా లేవని అన్నారు. చంద్రబాబు నాయుడు న్యాయ వ్యవస్థలను మేనేజ్ చేయలేకపోతున్నారని.. న్యాయవ్యవస్థలు ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి అంటూ నారాయణ స్వామి సంచలన కామెంట్స్ చేశారు.

Updated Date - 2023-10-18T10:50:19+05:30 IST